“ అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలో తనదైన ఒక ముద్ర ఆవిష్కరింపచేసిన అసాధారణ నాయకుడు ప్రధాన మంత్రి శ్రీ మోదీ. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే త్వరిత గతిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదా సాధించే దిశగా నడిపించారు. సమ్మిళిత వృద్ధిపై ఆయనకు గల దార్శనికత లక్షలాది ప్రజల్లో మెరుగైన రేపటిపై ఆశలు రేకెత్తించింది. ఆయన చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’, “డిజిటల్ ఇండియా”, “ స్కిల్ ఇండియా” ల వంటి కార్యక్రమాలు దేశం త్వరితగతిన సమతూకమైన ఆర్థికాభివృద్ధి సాధించడానికి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కూడా దోహదపడతాయి. ”