ప్రధాన మంత్రి మోదీ రాష్ట్ర గౌరవానికి ఒక సంకేతం. అంతేకాకుండా ప్రపంచ వేదిక మీద భారతదేశానికి ఎంతో గర్వాన్ని సంపాయించి పెట్టిన విశ్వ నాయకుడాయన. ఆయనను మేము "రాష్ట్ర రుషి''గా సత్కరిస్తున్నాం. భారతదేశంలోని 125 కోట్ల మంది ప్రజల మహత్వాకాంక్షలు ప్రధాన మంత్రి మోదీ లో ప్రతిబింబిస్తున్నాయి. ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో భారతదేశం పరివర్తన చెందుతోంది. ప్రభుత్వం మారింది; అలాగే, వ్యవస్థలు కూడా ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో మార్పునకు లోనవుతున్నాయి. నరేంద్ర మోదీ గారు మన ప్రధాన మంత్రిగా ఉన్నంత కాలం భారతదేశం ఎన్నటికీ పతనం కాదు.