పేదలందరికీ సౌరశక్తిని అందుబాటులోకి తెచ్చేందుకు భారతదేశం కొత్త సౌరశక్తి కూటమి గురించి అత్యంత ముఖ్యమైన, వినూత్న ప్రణాళికలను ప్రకటించింది. ఈ సహకార కూటమిలో దాదాపు 100 దేశాలు భాగస్వాములు కాగా, వందల కోట్ల ప్రజలను ఇది ప్రభావితం చేస్తుంది, అంతేగాక ఇది ఏకకాలంలో వాతావరణ మార్పు, పేదరిక సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుంది.