Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నిర్భయత్వాన్ని చాటడం, ప్రాణాలను కాపాడటం మంచి గుణాలు.. ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


భయానికి తావు ఇవ్వక పోవడం, ప్రాణాలను కాపాడటం సద్గుణాలు అని మనకు బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘అభయస్యైవ యో దాతా తస్యైవ సుమహత్ఫలమ్, న హి ప్రాణసమం దానం త్రిషు లోకేషు విద్యతే.
ప్రజల భయాన్ని దూరం చేసే వారికి అనంత ఆశీస్సులు లభిస్తాయి. ప్రాణ రక్షణకు మించిన బహుమతి మరేదీ ముల్లోకాలోనూ లేదు’’ అని పేర్కొన్నారు.

 

***