పిఎంఇండియా
కేంద్ర సిల్క్ బోర్డు (సిఎస్బి), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆగ్రో బయోలాజికల్ సైన్సెస్ మధ్య పట్టు పరిశ్రమ రంగంలో సంయుక్త పరిశోధనలకు సంబంధించి ఉన్న ఒప్పందాన్ని (ఎమ్ఒయు)ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరగిన మంత్రి మండలి సమావేశం దృష్టికి తెచ్చారు.
ఈ ఒప్పందం 11.11.2016న కుదిరింది. భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనువైన హైబ్రిడ్ పట్టు పురుగులను అభివృద్ధి చేయడానికి పరిశోధనలు జరుగుతాయి. ఈ రకం పట్టు పురుగుల అభివృద్ధి వల్ల మన దేశంలో ఉత్పత్తి అయ్యే పట్టు రాశి, వాసి పెరగడమే గాక, పట్టు ఉత్పత్తుల ఎగుమతి కూడా పెరుగుతుంది.
ఈ ఒప్పందం వల్ల భారత్ జౌళి, దుస్తుల పరిశ్రమ ఉత్పత్తుల నాణ్యత పెరిగి ఎగుమతులు వృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.