Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అకాడమిక్ లీడర్ శిప్ ఆన్ ఎడ్యుకేశన్ ఫర్ రిసర్జెన్స్ అంశం పై స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

అకాడమిక్ లీడర్ శిప్ ఆన్ ఎడ్యుకేశన్ ఫర్ రిసర్జెన్స్ అంశం పై స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

అకాడమిక్ లీడర్ శిప్ ఆన్ ఎడ్యుకేశన్ ఫర్ రిసర్జెన్స్ అంశం పై స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

అకాడమిక్ లీడర్ శిప్ ఆన్ ఎడ్యుకేశన్ ఫర్ రిసర్జెన్స్ అంశం పై స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


అకాడమిక్ లీడర్ శిప్ ఆన్ ఎడ్యుకేశన్ ఫర్ రిసర్జెన్స్ అంశం పై న్యూ ఢిల్లీ లో ఒక స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ప్ర‌సంగించారు.

ఎవ‌రైనా పున‌రుద్ధ‌రణ ను గురించి లేదా పునర్జాగరణను గురించిన ఆలోచ‌న ను చేసిన‌ప్పుడు మొట్టమొద‌ట‌గా మస్తిష్కంలో గోచ‌రించేది భార‌త‌దేశ భావ‌జాలం యొక్క శ‌క్తిని ప్ర‌పంచం స‌మ‌క్షం లో ఆవిష్క‌రింనటునవంటి స్వామి వివేకానందుల వారి చిత్రమే అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

స్వావ‌లంబ‌న‌, చ‌రిత్ర నిర్మాణం మ‌రియు మాన‌వీయ విలువ‌లు విద్య తాలూకు తత్వాలు అని స్వామి వివేకానంద స్ప‌ష్టం చేశార‌ని ప్ర‌ధాన మంత్రి జ్ఞ‌ప్తి కి తెచ్చారు. ఈ రోజున నూత‌న ఆవిష్క‌ర‌ణ విద్య యొక్క ఒక కీల‌క‌మైన తత్వంగా మారిపోయింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప్రాచీన భార‌తీయ గ్రంథాలైన వేదాల‌ను ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెస్తూ, విజ్ఞానానికి తావు లేనటువంటి స‌మాజాన్ని గాని, దేశాన్ని గాని, చివ‌ర‌కు మ‌న జీవితాల‌ను గాని

మనం ఊహించ‌జాలం అని పేర్కొన్నారు. త‌క్ష‌శిల‌, నాలందా, ఇంకా విక్ర‌మశిల వంటి మ‌న పాత విశ్వ‌విద్యాల‌యాలు జ్ఞానం తో పాటు నూత‌న ఆవిష్క‌ర‌ణ కు కూడా మహత్వాన్ని ఇచ్చాయ‌ని ఆయ‌న చెప్పారు. అలాగే బాబా సాహెబ్ భీంరావ్ ఆంబేడ్ కర్, దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ్ మ‌రియు డాక్ట‌ర్ రామ్ మ‌నోహ‌ర్ లోహియా గార్లు వెలిబుచ్చిన అభిప్రాయాల‌ను కూడా ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.

ప్ర‌స్తుతం ఏ దేశం గాని, ఏ వ్య‌క్తి గాని ఒంట‌రిత‌నం లో బ‌త‌క జాల‌ర‌ని శ్రీ న‌రేంద్ర మోదీ చెప్పారు. ‘గ్లోబ‌ల్ సిటిజ‌న్’ లేదా ‘గ్లోబ‌ల్ విలేజ్’ కోణం లో ఆలోచించ‌డానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. మ‌నం ఎదుర్కొంటున్న స‌వాళ్ళ‌కు ప‌రిష్కారాల‌ను క‌నుగొనే విధంగా మ‌న క‌ళాశాల‌ లు మ‌రియు మ‌న విశ్వ‌విద్యాల‌యాలు రూపొందాల‌ని ఆయ‌న చెప్పారు. ‘‘నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను గురించి ఆలోచించేటట్లు మ‌రియు వాటికి తుది రూపాన్ని ఇచ్చేట‌ట్లు విద్యా సంస్థ‌ల‌ ను ఒక‌దాని తో మ‌రొక‌టి ముడివేయ‌వ‌ల‌సిన’’ అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. త‌ర‌గ‌తి గ‌ది లో నేర్చుకొనే అంశాల‌ను దేశం యొక్క ఆకాంక్ష‌ల తో పెన‌వేయవలసిందంటూ విద్యార్థుల‌ కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. చిన్నారుల‌ లో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ ను ప్రోత్స‌హించ‌డం కోసం అట‌ల్ టింక‌రింగ్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేసిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. విద్యా రంగ సంబంధిత మౌలిక స‌దుపాల‌యాల‌ ను మెరుగుప‌ర‌చేందుకు ఉద్దేశించిన‌టువంటి రీ వైట‌లైజేశ‌న్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అండ్ సిస్ట‌మ్స్ ఇన్ ఎడ్యుకేశన్ (ఆర్ఐఎస్ఇ) ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

స‌మాజానికి చ‌క్క‌టి ఉపాధ్యాయుల‌ను త‌యారు చేయ‌డానికి ఉన్న ప్రాముఖ్య‌ాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కి ప‌లికారు. డిజిట‌ల్ లిట‌రసీ ని వ్యాప్తి చేసే, జీవించ‌డం లో సౌల‌భ్యాన్ని మెరుగుప‌ర‌చే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల ప‌ట్ల మ‌రింత ఎక్కువ అవ‌గాహ‌న ను వ్యాప్తి చేసే బాధ్య‌త‌ ను విద్యార్థులు మ‌రియు ప‌రిశోధ‌క విద్యార్థులు తీసుకో గలగాలని కూడా ఆయ‌న అన్నారు.

యువతీయువకులు ‘బ్రాండ్ ఇండియా’ కు ప్ర‌పంచవ్యాప్త గుర్తింపు ను ఇచ్చిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. యువ ప్ర‌తిభావంతుల‌ ను తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన‌టువంటి స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా ఇంకా స్కిల్ ఇండియా త‌దిత‌ర ప‌థ‌కాల‌ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.