పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్తోనూ, ఆయన కుటుంబ సభ్యులతోనూ సమావేశమయ్యారు.
శ్రీ పవన్ కల్యాణ్ క్షేమ సమాచారాన్ని ప్రధానమంత్రి అడిగి తెలుసుకోవడంతో పాటు, ఆయన త్వరగా కోలుకుని ఆరోగ్యవంతుడు కావాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధానమంత్రి తన సందర్శన వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రజలతో పంచుకుంటూ :
‘‘ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులతో భేటీ అయ్యాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ఆయనకు మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందజేశాను’’ అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను.@PawanKalyan pic.twitter.com/OOHSDEbbTA
— Narendra Modi (@narendramodi) May 10, 2026