Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంజ‌ర్ లో ఎల్ఎన్‌జి టర్మిన‌ల్ మ‌రియు గొట్ట‌పు మార్గం ప‌థ‌కాల‌ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


అంజ‌ర్ లో ముంద్రా ఎల్ఎన్‌జి టర్మిన‌ల్ ను, అంజ‌ర్ – ముంద్రా గొట్ట‌పు మార్గ ప‌థ‌కాన్ని, ఇంకా పాలంపుర్‌-పాలీ-బార్మేర్ గొట్ట‌పు మార్గం ప‌థ‌కాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, క‌చ్ఛ్ నుండి త‌న‌కు అందిన ఆప్యాయ‌త సాటిలేనిద‌ని తెలిపారు. గ‌త 20 సంవ‌త్స‌రాలుగా క‌చ్ఛ్ ప్రాంతం లో చోటు చేసుకొన్న అభివృద్ధి ప‌నుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు.

ఎల్ఎన్‌జి టర్మిన‌ల్ ను ప్రారంభించుకోవ‌డం నేటి కార్య‌క్ర‌మాల లో ఒక ప్ర‌ధాన‌మైన కార్య‌క్ర‌మ‌మ‌ని ఆయ‌న అన్నారు. ఎల్ఎన్‌జి టర్మిన‌ల్స్ మూడింటిని ప్రారంభించే భాగ్యం త‌న‌కు ద‌క్కింద‌ని ఆయ‌న చెప్పారు.

గుజ‌రాత్ త‌న మొట్ట‌మొద‌టి ఎల్ఎన్‌జి టర్మిన‌ల్ ను పొందిన వేళ ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌య్యార‌ని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ప్ర‌స్తుతం ఈ రాష్ట్రం నాలుగో ఎల్ఎన్‌జి టర్మిన‌ల్ ను పొందేందుకు స‌న్నద్ధంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

భార‌త‌దేశ ఎల్ఎన్‌జి కేంద్రం గా గుజ‌రాత్ రూపుదిద్దుకొంటోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఇది ప్ర‌తి ఒక్క గుజ‌రాత్ పౌరుడికి/పౌరురాలికి గ‌ర్వ‌కార‌ణ‌మం కావాల‌ని ఆయ‌న అన్నారు. ఏ దేశం వృద్ధికైనా ఒక బ‌ల‌మైన శ‌క్తి రంగం అత్యంత అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. శ‌క్తి రంగం లో మ‌నం వెనుక‌బ‌డిపోతే పేద‌రికాన్ని అంతమొందించ‌లేమ‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయ‌ని, వారు సాంప్రదాయకమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ఐ-వేస్, గ్యాస్ గ్రిడ్స్‌, వాట‌ర్ గ్రిడ్స్‌, తో పాటు ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్ స్‌ కూడా కావాల‌ని కోరుకొంటున్నార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప‌ర్య‌ట‌న రంగంలో సమృద్ధమైనటువంటి అవ‌కాశాలు ఉన్నాయ‌ని, భార‌త‌దేశానికి రావాల‌ని ప్ర‌పంచం కుతూహ‌లాన్ని వ్య‌క్తం చేస్తోందని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. క‌చ్ఛ్ లోని వైట్ ర‌ణ్ ఏ మాదిరిగా ప్ర‌పంచం అంత‌టికీ ఆక‌ర్ష‌క బిందువుగా మారిందో మ‌నం చూశాం అని ఆయ‌న అన్నారు. విమాన‌యాన రంగాన్ని మ‌రింత త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన‌దిగా మ‌ల‌చేందుకు మ‌రియు సంధానాన్ని మెరుగుప‌ర‌చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొన్న చ‌ర్య‌ల‌ను గురించి ఆయ‌న వివ‌రించారు.

గ్రామాల‌న్నింటికీ విద్యుత్తు సౌక‌ర్యాన్ని అందించేందుకు కృషి చేశామ‌ని, భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క కుటుంబానికి విద్యుత్తు ను స‌మ‌కూర్చే దిశ‌గా కృషి జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. భార‌త‌దేశం లోని సామాన్య పౌరుల జీవితాల లో గుణాత్మ‌క‌మైన మార్పు ను తీసుకు రావాల‌ని మేం ఆకాంక్షిస్తున్నాం అంటూ ఆయ‌న వివ‌రించారు.