Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అత్య‌ధుత‌న‌మైన స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ను అహ‌మ‌దాబాద్ లో ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

అత్య‌ధుత‌న‌మైన స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ను అహ‌మ‌దాబాద్ లో ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

అత్య‌ధుత‌న‌మైన స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ను అహ‌మ‌దాబాద్ లో ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

అత్య‌ధుత‌న‌మైన స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ను అహ‌మ‌దాబాద్ లో ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


అత్య‌ధునాత‌న‌మైన సూప‌ర్ స్పెషాలిటీ పబ్లిక్ హాస్పిట‌ల్ స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ రిస‌ర్చ్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అహ‌మ‌దాబాద్ లో నేడు ప్రారంభించారు. ఒక ఎయిర్ ఆంబులెన్స్ తో పాటు అన్ని ఆధునిక సౌక‌ర్యాల‌ తో కూడిన 1500 ప‌డ‌క‌లున్న ఈ ఆసుప‌త్రి ని అహ‌మ‌దాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ 78 మీట‌ర్ల ఎత్త‌యిన భ‌వ‌నం లో నిర్మించింది.

ఆసుప‌త్రి లోని స‌దుపాయాల‌ ను ప్ర‌ధాన మంత్రి ప‌రిశీలించారు. ప్ర‌పంచ శ్రేణి ఆసుప‌త్రి ని నెల‌కొల్పడం కోసం అహ‌మ‌దాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ చేసిన కృషి ని ఆయ‌న హ‌ర్షించారు. ‘‘అహ‌మ‌దాబాద్ లోని స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ రిస‌ర్చ్ ఆసుపత్రి దేశం లో ఇత‌ర ప్ర‌భుత్వ ఆసుపత్రుల‌ కు ఒక ఆదర్శ ఆసుపత్రి గా రుజువవుతుంద‌’’ని ఆయ‌న అన్నారు.

750 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో, 17 అంత‌స్తుల లో నిర్మితమైన ఆసుప‌త్రి త‌క్కువ ఖ‌ర్చు లో ప్ర‌పంచ శ్రేణి సేవ‌ల ను అందిస్తుంది. అంతేకాక దీని ని ‘ఆయుష్మాన్ భార‌త్’తో జోడించ‌డమైంది. ఈ సంద‌ర్భం గా శ్రీ మోదీ స‌భికుల ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, ‘ఆయుష్మాన్ భార‌త్’ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి వివ‌రించారు. ‘‘ ‘ఆయుష్మాన్ భార‌త్’ వ‌ల్ల‌నే చిన్న ప‌ట్ట‌ణాల లో సైతం నూత‌న ఆసుపత్రుల ఆవ‌శ్య‌క‌త హెచ్చుతోంది. కొత్త ఆసుప‌త్రులు త్వరిత గతి న ఆరంభ‌మ‌వుతున్నాయి. వైద్యుల‌ కు, పారామెడిక‌ల్ సిబ్బంది కి డిమాండు పెరుగుతోంది. త‌ద్వారా ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగం లో అనేక ఉద్యోగావ‌కాశాలు యువ‌తీయువ‌కుల‌ కు ఏర్ప‌డ‌నున్నాయ’’ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల కాలం లో ఆరోగ్య సంర‌క్ష‌ణ స‌దుపాయాల లో మ‌రియు వైద్య విద్య లో ప్ర‌ధానమైన విస్త‌ర‌ణ చోటుచేసుకొంద‌ని, పౌరుల ఆరోగ్య సంర‌క్ష‌ణ అవ‌స‌రాల‌ ను నెర‌వేర్చ‌డం లో ఇది ఎంత‌గానో స‌హాయ‌కారి కాగ‌ల‌ద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

పేద‌ల ప‌ట్ల శ్ర‌ద్ధ తీసుకోవ‌డం, వారి ఇక్క‌ట్టుల‌ను తీర్చ‌డం అనే అంశాలు తెర మీద‌కు వ‌చ్చాయ‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ‘‘ప్ర‌భుత్వం పేద‌ల ప‌క్షాన నిల‌బ‌డుతుంది. వారి ప‌ట్ల ప్ర‌భుత్వాని కి ఉన్న ప్రాథమ్యం ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల విస్త‌ర‌ణ లో ప్ర‌తిబింబిస్తోంది. అంతేకాదు, జ‌నరిక్ ఔష‌ధాల‌ ను ‘ప్ర‌ధాన మంత్రి జ‌న ఔష‌ధి యోజ‌న’ లో భాగం గాత‌క్కువ ధ‌ర‌ల‌ కు స‌మ‌కూర్చ‌డం జ‌రుగుతోంది. ప్ర‌ధాన మంత్రి జ‌న ఔష‌ధి కేంద్రాలు దేశ‌ం అంతటా దాదాపు 5000 సంఖ్య లో ఏర్పాట‌య్యాయి’’ అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

అంద‌రికీ స‌మానావ‌కాశాల‌ ను క‌ల్పించే దిశ‌ గా త‌న ప్ర‌భుత్వం దీక్షాబ‌ద్ధురాలై ఉంద‌ని, జ‌న‌ర‌ల్ కేట‌గిరీ పేద‌ల‌ కు 10 శాతం రిజ‌ర్వేశన్ ఈ దిశ‌గా వేసిన‌టువంటి ఒక ముందంజ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఇందుకోసం విద్యా సంస్థ‌ల లో సీట్ల సంఖ్య‌ ను 10 శాతం మేర పెంచ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. జ‌న‌ర‌ల్ కేట‌గిరీ పేద‌ల‌ కు ప్ర‌భుత్వ ఉద్యోగాల లో, విద్యా సంస్థ‌ల లో 10 శాతం రిజ‌ర్వేశన్ క‌ల్పించాల‌న్న నిర్ణయాన్ని అమ‌లు చేసిన మొద‌టి రాష్ట్రం గా నిల‌చినందుకు గుజ‌రాత్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌ధాన మంత్రి కొనియాడారు.

గుజ‌రాత్ ను తాను సంద‌ర్శించ‌డం కొత్త సంవ‌త్స‌రం లో ఇది మొద‌టి సారి అని, ప్రస్తుతం పండుగ‌ల కాలం లో ఇది చోటు చేసుకొంద‌ని చెప్తూ, అహ‌మ‌దాబాద్ ప్ర‌జ‌ల కోసం ఒక పెద్ద ఆరోగ్య సంర‌క్ష‌ణ నిల‌యాన్ని అంకితం చేసేందుకు ఇంత‌ క‌న్నా మంచి స‌మ‌యం మరేది ఉంటుంద‌ంటూ ప్ర‌ధాన మంత్రి చ‌మ‌త్క‌రించారు. ఈ త‌ర‌హా ప్ర‌పంచ శ్రేణి ఆరోగ్య ర‌క్ష‌ణ స‌దుపాయం తో ముందుకు వ‌చ్చిన న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ లు దేశం లో అతి కొద్దే ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. అహ‌మ‌దాబాద్ పురపాలకాధ్యక్షుని గా ఆరోగ్యం, ఆరోగ్య రక్షణ మరియు పరిశుభ్రత ల ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి ఒక ఉదాహ‌ర‌ణ వ‌లే నేతృత్వాన్ని అందిస్తూ స‌ర్దార్ ప‌టేల్ గారు పోషించిన పాత్ర‌ ను ప్ర‌ధాన మంత్రి ప్రశంసించారు.

ప్ర‌ధాన మంత్రి కార్యక్రమం లో త‌న ప్ర‌సంగం ముగింపు లో- అంద‌రికీ స‌మాన అవ‌కాశాన్ని క‌ల్పించడం తో పాటు అభివృద్ధి కి క‌ట్టుబ‌డాల‌న్న సంక‌ల్పాని కి అనుగుణం గా స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్ అనేది ‘న్యూ ఇండియా’ ఆవిష్కారాని కి అనుస‌రించ‌వ‌ల‌సిన మార్గం- అని స్పష్టం చేశారు.