Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ఒకటో సభ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ఒక‌టో స‌భ ను విజ్ఞాన్ భ‌వ‌న్ లో ఈ రోజు ప్రారంభించారు. రెండో ఐఒఆర్ఎ రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ మినిస్టీరియ‌ల్ మీటింగ్ రెండో గ్లోబ‌ల్ రీ-ఇన్వెస్ట్ (రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ ఇన్వెస్ట‌ర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో) ల ప్రారంభం కూడా ఇదే కార్య‌క్ర‌మం లో చోటు చేసుకొంది. ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ శ్రీ ఎంటోనియో గుటేరేజ్ ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్నారు.

స‌భికుల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, మాన‌వాళి గ‌త 150-200 సంవ‌త్స‌రాలు గా శ‌క్తి అవ‌సరాల కోసం శిలాజ జ‌నిత ఇంధ‌నాల పై ఆధార ప‌డింద‌న్నారు. సౌర‌ శక్తి, ప‌వ‌న‌ శక్తి, ఇంకా జ‌ల శక్తి ల వంటి ఐచ్ఛికాల‌ను మ‌రింత నిల‌క‌డ‌త‌నం తో కూడిన‌టువంటి శ‌క్తి సంబంధ ప‌రిష్కార మార్గాలు గా ప్రకృతి ప్ర‌స్తుతం సంకేతీకరిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా, భ‌విష్య‌త్తు లో మాన‌వాళి సంక్షేమం కోసం 21వ శ‌తాబ్దం లో ఏర్పాటు చేసిన సంస్థ‌ ల‌ను గురించి ప్ర‌జ‌లు మాట్లాడుకొన్న‌ప్పుడ‌ల్లా, ఆ సంస్థ‌ ల జాబితా లో ఇంట‌ర్‌ నేశ‌న‌ల్ సోల‌ర్ అల‌య‌న్స్ అగ్ర‌ స్థానం లో నిలుస్తుంద‌న్న విశ్వాసాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. జ‌ల‌, వాయు సంబంధ న్యాయం ప‌ట్ల కృషి చేసే దిశ‌ గా ఇది ఒక గొప్ప వేదిక అని ఆయ‌న చెప్పారు. రానున్న కాలం లో కీల‌క‌మైన ప్ర‌పంచ శ‌క్తి స‌ర‌ఫ‌రాదారు గా ఒపిఇసి స్థానాన్ని ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ స్వీక‌రించ‌గ‌ల‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి ని ఇదివ‌ర‌క‌టి క‌న్నా ఎక్కువ‌ గా వినియోగిస్తున్న తీరు యొక్క ప్రభావం భార‌త‌దేశం లో ప్ర‌స్తుతం ద్యోతకం అవుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. పారిస్ ఒప్పందం ల‌క్ష్యాల దిశ‌గా ఒక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక కోసం భార‌త‌దేశం కృషి చేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. 2030వ సంవ‌త్స‌రం లో భార‌త‌దేశం యొక్క మొత్తం శ‌క్తి అవ‌స‌రాల లో 40 శాతం వ‌ర‌కు శిలాజ జనితం కానటువంటి ఇంధ‌న వ‌న‌రుల ద్వారా ఉత్ప‌త్తి చేయాల‌నేది ల‌క్ష్య‌ం అని ఆయ‌న చెప్పారు. ‘‘పేద‌రికం నుండి విద్యుత్తు’’ కు సంబంధించినటువంటి ఒక కొత్త ఆత్మ విశ్వాసాన్ని భార‌త‌దేశం అల‌వ‌ర‌చుకొంటోంద‌ని ఆయ‌న తెలిపారు.

విద్యుత్తు ఉత్ప‌త్తి తో పాటు, విద్యుత్తు నిలవ కూడా ముఖ్య‌మేన‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ సంద‌ర్భంగా నేశ‌న‌ల్ ఎన‌ర్జీ స్టోరేజ్ మిశ‌న్ ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ మిశ‌న్ లో భాగంగా ప్ర‌భుత్వం డిమాండు ను సృష్టించ‌డం, దేశీయంగా త‌యారు చేయ‌డం, నూత‌న ఆవిష్క‌ర‌ణ లు, ఇంకా శ‌క్తి నిలవ చేయ‌డం అంశాల పై శ్ర‌ద్ధ వ‌హిస్తోంద‌న్నారు.

భార‌త‌దేశం సౌర విద్యుత్తు కు, ప‌వ‌న విద్యుత్తు కు తోడు బ‌యోమాస్‌, బ‌యో ఫ్యూయ‌ల్‌, ఇంకా బ‌యో-ఎన‌ర్జీ ల‌పై క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. భార‌త‌దేశ ర‌వాణా వ్య‌వ‌స్థ ను స్వ‌చ్ఛ ఇంధ‌న ఆధారిత‌మైంది గా మ‌ల‌చేందుకు ప్ర‌యత్నాలు కొన‌సాగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. బ‌యో-వేస్ట్ ను బ‌యో ఫ్యూయ‌ల్ గా మార్చ‌డం ద్వారా భార‌త‌దేశం ఒక స‌వాలు ను ఒక అవ‌కాశం గా తీసుకొంటోంద‌ని ఆయ‌న చెప్పారు.