పిఎంఇండియా
ఉన్నత విద్య రంగంలో భారత్, కెనడాల మధ్య సహకారం అంశంపై ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎంఓయూ)ను పునరుద్ధరించుకోవడానికి కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఉన్నత విద్య రంగంలో భారత్, కెనడాల మధ్య ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను మరింత పక్కాగా అమలుచేయడానికి ఈ ఎంఓయూ తోడ్పడనుంది.
నేపథ్యం:
ఉన్నత విద్య రంగంలో భారత్, కెనడాల మధ్య సహకారం అంశంపై 2010 జూన్ లో ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎంఓయూ) పై సంతకాలు జరిగాయి. ఈ ఎంఓయూ కాల పరిమితి ఐదేళ్ళు. ఎంఓయూ లో పేర్కొన్న ప్రకారం ఐదేళ్ళు పూర్తయిన తర్వాత మరో ఐదేళ్ళపాటు దీనిని పునరుద్ధరించుకోవాలని నియమం పెట్టుకున్నారు. భారత్ – కెనడాలలో ఉన్నత విద్యాసంస్థల మధ్య సమన్వయానికి అపార అవకాశాలు ఉన్నాయని గుర్తించి, ఉన్నత విద్య – పరిశోధన రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను ముమ్మరం చేసుకోవడానికి ఈ ఎంఓయూ ను పునరుద్ధరించాలని ప్రతిపాదించారు.