Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిశా, పంజాబ్‌ లలో రోడ్డు ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం; ఇది మౌలిక సదుపాయాలను, అనుసంధానాన్ని మెరుగుపరచగలదు: ప్రధాన మంత్రి


ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో రోడ్డు ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (సి సి ఇ ఎ) ఆమోదం తెలిపింది. ఇది ఆ రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలను, అనుసంధానాన్ని మెరుగుపరచడంలో తోడ్పడగలదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరుస ట్వీట్ లలో వెల్లడించారు.

“పంజాబ్‌ లోని జాతీయ రహదారి 344 ఎ కు చెందిన ఫగ్బాడా, రూప్‌నగర్ సెక్షన్ ను నాలుగు దోవల మార్గంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనను సి సి ఇ ఎ ఆమోదించింది.

ఇంచుమించుగా 80.820 కిలోమీటర్ల దూరమున్న ఈ రహదారిని అభివృద్ధి పరచేందుకు రూ. 1,444.42 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేశారు.

ఈ ప్రాజెక్టు వల్ల్ పంజాబ్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచగలదు. అంతే కాకుండా, ఈ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులను కూడా చక్కదిద్దగలదు.

ఒడిశా లోని జాతీయ రహదారి-42 (న్యూ ఎన్ హెచ్-55) కు చెందిన అంగుల్-సంబల్‌పూర్ సెక్షన్ ను నాలుగు దోవల మార్గంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు సి సి ఇ ఎ ఆమోదం తెలిపింది.

ఇంచుమించు 151 కిలోమీటర్ల మేర ఉండే ఈ రహదారిని అభివృద్ధి పరచేందుకు రూ. 2,491.53 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేశారు.

ఈ ప్రాజెక్టు ఒడిశాలో మౌలిక సదుపాయాలను వేగంగా మెరుగుపరచడంతో పాటు అంగుల్-సంబల్‌పూర్ సెక్షన్ లో ప్రయాణ ఖర్చును, ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో కూడా దోహదం చేయగలదు. మరీ ముఖ్యంగా అంగుల్-సంబల్‌పూర్ సెక్షన్ లో భారీ స్థాయిలో నడిచే వాహనాల రాకపోకలకు సౌకర్యంగా ఉండగలదు.

మహారాష్ట్రలోని జాతీయ రహదారి 211కి చెందిన ఔరంగబాద్-తేల్ వాడి సెక్షన్ ను నాలుగు దోవల మార్గంగా అభివృద్ధి పరచే ప్రతిపాదనకు సి సి ఇ ఎ ఆమోదం తెలిపింది.

ఇంచుమించు 87 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును తీర్చిదిద్దడానికి రూ. 2,028.91 కోట్ల వ్యయం కావచ్చని అంచనా వేశారు.

ఈ మార్గాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు చక్కబడడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరగగలవు.” అని ప్రధాన మంత్రి వివరించారు.