పిఎంఇండియా
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
ఈ విషాదకర సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్లో జరిగిన ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’
The mishap in Karwar, Uttara Kannada district of Karnataka, is deeply saddening. My thoughts are with the bereaved families in this hour of grief. I pray for the speedy recovery of those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 9, 2026
ಕರ್ನಾಟಕದ ಉತ್ತರ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆಯ ಕಾರವಾರದಲ್ಲಿ ಸಂಭವಿಸಿದ ದುರ್ಘಟನೆ ತೀವ್ರ ನೋವು ತಂದಿದೆ. ಈ ಕಠಿಣ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ಸಹಾನುಭೂತಿ ಶೋಕತಪ್ತ ಕುಟುಂಬಗಳೊಂದಿಗಿದೆ. ಗಾಯಗೊಂಡವರು ಶೀಘ್ರವಾಗಿ ಚೇತರಿಸಿಕೊಳ್ಳಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ: ಪ್ರಧಾನಮಂತ್ರಿ @narendramodi
— PMO India (@PMOIndia) July 9, 2026