Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ణాటకలోని కార్వార్‌లో ప్రమాదం… ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం


కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

ఈ విషాదకర సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

‘‘కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్‌లో జరిగిన ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’