పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం- ‘వివేక స్మారక’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఈ సందర్భంగా తొలుత అభివాదం చేయడంతోపాటు నగర ఆరాధ్య దైవమైన శ్రీ చాముండేశ్వరీ దేవికి ఆయన భక్తిపూర్వకంగా ప్రణమిల్లారు.
అనంతరం ప్రసంగిస్తూ- రామకృష్ణ మిషన్ బోధనలతో తనకుగల ప్రగాఢ ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సామాన్యుడిగా ప్రారంభమైన తన జీవితంలో ప్రస్తుత బాధ్యతల దాకా సాగిన ప్రస్థానాన్ని, ఈ క్రమంలో తనపై ఆ సంస్థ అపార ప్రభావాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. “మైసూరులోని ఈ పావన భూమిపై మీ అందరి సమక్షంలో నేనొక విభిన్న, శక్తిమంతమైన అనుభూతి పొందుతున్నాను” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ నగరం దేశ సాంస్కృతిక చైతన్యానికి శాశ్వత కేంద్రమని ప్రధానమంత్రి మైసూరు వైభవాన్ని కొనియాడారు. అద్భుత రాచప్రాసాదాలు, ఉత్సాహం ఉప్పొంగే వాడుకలు, చారిత్రక సంప్రదాయ సహిత ఘనమైన వారసత్వాన్ని ఈ నగరం అత్యుత్తమ రీతిలో పరిరక్షించుకుంటూ వస్తున్నదని ఆయన ప్రశంసించారు. “ఈ నగరంలో అణువణువునా ఉట్టిపడే భారతీయ వారసత్వాన్ని ఎంత సమర్థంగా సంరక్షించుకుంటూ, సుసంపన్నం చేశారో చూడటం ఎవరికైనా ఎనలేని సంతృప్తినిస్తుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
నేడు ప్రారంభించిన స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం ‘వివేక స్మారక’ ప్రాధాన్యాన్ని వివరిస్తూ- మహనీయుడైన ఆ సర్వసంగ పరిత్యాగిని, కువెంపు వంటి స్థానిక పండితులను, మేధాపరమైన నగర చరిత్రతో వారికిగల చారిత్రక బంధాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. “వారు కొనసాగించిన గొప్ప దీక్షను ఈ చారిత్రక కేంద్ర ప్రారంభోత్సవం ద్వారా మనం సరికొత్తగా విస్తరిస్తున్నాం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
ఒక సామాన్యుడిని అసాధారణ వ్యక్తిత్వం గలవాడుగా తీర్చిదిద్దడానికి తగిన కఠిన ఆధ్యాత్మిక సాధన మార్గాలను ప్రస్తావిస్తూ- సాధనారంభ దశలో మార్గదర్శకులైన మహనీయుల పాత్రక కీలకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “సాధకుడిని గుర్తించేవారే చివరకు వారి ఆధ్యాత్మిక సిద్ధిలో కీలక భాగస్వాములు కాగలరు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన చారిత్రక సంఘటనను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ముప్ఫై ఏళ్లు కూడా నిండని, పెద్దగా గుర్తింపు లేని యువ సంచార సన్యాసికి (స్వామి వివేకానందను) 130 ఏళ్ల కిందట మైసూరు మహారాజు ప్రత్యేక గుర్తింపునిచ్చి ఆదరించిన తీరును గుర్తుచేశారు. ఆనాడు తనకు లభించిన మద్దతును స్వామి వివేకానంద తన అమెరికా పర్యటనలో ఎంతో కృతజ్ఞతాభావన కనబరిచారని పేర్కొన్నారు. “ఆయనకు పెద్దగా ప్రాచుర్యం లేని రోజుల్లోనే ఆ యువ సన్యాసిలోని తేజస్సును గుర్తించిన వారిలో మైసూరు మహారాజు అగ్రగణ్యులు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
రామకృష్ణ ఆశ్రమ మూలతత్త్వాన్ని, స్వామి వివేకానంద నిస్వార్థ సేవాభావంతో సంధానిస్తూ- విద్యా, వైద్య, విపత్తు సహాయక చర్యలలో ఆ సంస్థ శతాబ్దకాలపు అంకితభావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. “ఇతరుల సేవకు అంకితమైన వాడే నిజమైన జీవితం గడిపినవాడనే తారకమంత్రాన్ని అనుసరిస్తూ ఈ ఆశ్రమం తన అద్భుత వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది” అని శ్రీ మోదీ కొనియాడారు.
నేడు ప్రారంభించిన ఈ స్మారక చిహ్నం భవిష్యత్తుపై చూపగల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ- వ్యక్తిగత ఆకాంక్షలకన్నా దేశానికి, అణగారిన వర్గాల సముద్ధరణకు ప్రాధాన్యమిచ్చే యువతరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ సంస్థదేనని వ్యాఖ్యానించారు. “మాతృభూమి సేవ, పేదల కష్టాలను కడతేర్చడమే జీవిత పరమోద్దేశంగా కృషి చేయగల యువతను మనమిక్కడ తీర్చిదిద్దాలి” అని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.
స్వామి వివేకానందుని కాలంలో దేశ యువత దాస్యం చేయాల్సిన స్థితిని, వారి ప్రస్తుత ప్రపంచ ఆధిపత్యాన్ని పోలుస్తూ- దేశాభివృద్ధికి యువత విద్యా సంపన్నతే అత్యుత్తమ పునాదిగా ఆ తత్త్వవేత్త భావించారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. “ఒకనాటి దాస్య శృంఖల నిర్బంధిత భారత యువతరం నేడు యావత్ ప్రపంచ ప్రగతికి చురుగ్గా కృషి చేస్తూ నవ్యోత్తేజమిస్తున్నది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
యువతరానికి మాత్రమే సాధ్యమైన అద్భుత సాంకేతిక, ఆర్థిక విజయాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. ప్రపంచంలో శరవేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా, మూడో అతిపెద్ద అంకురావరణ వ్యవస్థగా, రెండో అతిపెద్ద మొబైల్ తయారీ సామర్థ్యంగల దేశంగా భారత్ను సమున్నత శిఖరాలకు చేర్చిన ఘనత వారిదేనని కొనియాడారు. “కేవలం మన యువత అపార సామర్థ్యంతోనే భారత్ నేడు ఏఐ, డీప్ టెక్, అంతరిక్ష సాంకేతికత, ఆవిష్కరణలలో అద్భుత నూతనాధ్యాయాలను లిఖిస్తోంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఏరోస్పేస్ రంగంలో ఇటీవల సాధించిన ఒక చారిత్రక విజయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశంలో డిజిటల్, తయారీ విప్లవాల అప్రతిహత వేగానికి ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన రాకెట్ ప్రయోగం విజయవంతం కావడమే తిరుగులేని నిదర్శనమని ఆయన ఉటంకించారు. “స్వయంసమృద్ధ భారత్ లేదా మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల అంతిమ విజయానికి దోహదం చేసే చోదకశక్తి భారత యువతరం మాత్రమే”నని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ జనసంఖ్య లబ్ధిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రధానమంత్రి అన్నారు. సరైన అవకాశాలు, విస్పష్ట దిశానిర్దేశం, పటిష్ట విద్యా మౌలిక సదుపాయాలు తోడైతే యువత సామర్థ్యం జాతీయ శక్తిగా రూపాంతరం చెందగలదని ఆయన స్పష్టం చేశారు. “తమ సొంత గడ్డపై భారీ సంకల్పాలను నిర్దేశించుకోవడంలో సంపూర్ణ ఆత్మవిశ్వాసం లభిస్తే యువత శక్తిసామర్థ్యాలు అంతిమంగా దేశానికి తిరుగులేని బలం కాగలవు” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాల కల్పన పరంగా దశాబ్దం నుంచీ సాగిన భారీ విస్తరణను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు విస్తృత గణాంకాలను వివరిస్తూ- దేశంలో 650కి పైగా కొత్త విశ్వవిద్యాలయాలు, 14,000 కళాశాలలు, ‘ఐఐఎం’లు, ‘ఐఐటీ’ల వంటి అనేక ప్రముఖ సంస్థల స్థాపన, వైద్యవిద్యలో సీట్ల సంఖ్య దాదాపు రెట్టింపు పెరిగి 1,40,000కు చేరడం వంటి ఉదాహరణను ఆయన ఉటంకించారు. “దేశవ్యాప్తంగా నేడు విద్యా సంస్థల సంఖ్య నిరంతరం వేగంగా ఇనుమడించడం నాకెంతో సంతోషాన్నిస్తోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
విద్యా వ్యవస్థ సమగ్ర ఆధునికీకరణను వివరిస్తూ- ప్రస్తుత 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్లు విద్యా చట్రం పునర్వ్యవస్థీకరణకు చురుగ్గా దోహదం చేస్తున్న జాతీయ విద్యా విధానాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. “ఒకవైపు మౌలిక సదుపాయాలను మేం భారీగా ఆధునికీకరిస్తున్నాం… మరోవైపు మొత్తం విద్యా వ్యవస్థను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం” అని శ్రీ మోదీ ప్రకటించారు.
ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యలో మార్పులను ప్రస్తావిస్తూ- బాలల్లో శాస్త్రీయ ఆవిష్కరణల దృక్పథాన్ని ప్రోత్సహించేందుకు 14,000కు పైగా ‘పీఎం శ్రీ’ పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే, 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లు పనిచేస్తున్నాయని ప్రముఖంగా ప్రస్తావించారు. “విద్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకూడదు. అది బాలల్లో ఆవిష్కరణ-లోతైన శాస్త్రీయ దృక్పథాన్ని చురుగ్గా పెంపొందించేలా చూడటం మన కర్తవ్యం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
సామాజిక సమానత్వంపై స్వామి వివేకానంద దార్శనికతను ఆధునిక విద్యా సంస్కరణలతో జోడిస్తూ- వివక్షపూరిత అవరోధాలను క్రమపద్ధతిలో తొలగించడాన్ని ప్రధానమంత్రి అభినందించారు. సైనిక పాఠశాలలు, ‘ఎన్డీఎ’ వంటి విద్యాసంస్థలలో బాలికలకు ప్రవేశం, మాతృభాషలలో వృత్తి విద్యా డిగ్రీ కోర్సుల విప్లవాత్మక జోడింపు వంటి సంస్కరణలను ఆయన సగర్వంగా ఉటంకించారు. “విద్యాభ్యాసం, అవకాశాల కల్పనలో ఎలాంటి వివక్షకు తావివ్వరాదన్నదే నేడు దేశంలో సంపూర్ణ ఏకీకృత దృక్పథంగా రూపొందింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
వ్యక్తిత్వ వికాసంలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణల కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు ‘ఖేలో ఇండియా’ గేమ్స్ వంటి విస్తృత కార్యక్రమాల ద్వారా జాతీయ క్రీడా సంస్కృతిని ప్రభుత్వం చురుగ్గా ప్రోత్సహిస్తున్నదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. “మన దేశ సర్వతోముఖాభివృద్ధిలో క్రీడలు నేడు అత్యంత కీలక భాగంగా అధికారికంగా గుర్తింపు పొందడమే కాకుండా క్రీడాకారులకు ఇతోధిక ప్రోత్సాహం లభిస్తోంది” అని శ్రీ మోదీ ప్రకటించారు.
అంతర్జాతీయ విజయాల సాధనలో ప్రాథమిక స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల భారీ విస్తరణ పాత్రను వివరిస్తూ- చిన్న పట్టణాల నుంచి పుట్టుకొస్తున్న ప్రతిభగల క్రీడాకారుల వల్ల ప్రపంచ వేదికలపై భారత్ ప్రదర్శనలో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “మన అసాధారణ క్రీడాకారులు అద్భుతరీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా భరతమాత పుత్రికలు దేశం ప్రతిష్టకు నిరంతరం మరింత కీర్తిని జోడిస్తున్నారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
మైసూరులో నేడు ప్రారంభించిన స్మారక చిహ్న ప్రత్యక్ష స్ఫూర్తితో ఉన్నత సామాజిక ప్రయోజనాల దిశగా స్థానిక యువత కృషిలో పౌర సమస్యల పరిష్కార బాధ్యత కీలకమైనదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. “స్వామి వివేకానంద తరహాలో ఈ వివేక స్మారకం కూడా ఒక గొప్ప ప్రయోజనం దిశగా మన అవిశ్రాంత కృషికి ప్రగాఢ స్ఫూర్తినిస్తుంది” అని శ్రీ మోదీ అన్నారు.
దేశంలోని అత్యంత పరిశుభ్ర నగర కేంద్రాలలో మైసూరు ఒకటిగా నిలవడంపై ప్రశంసిస్తూ- పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణపై పౌరులు నిర్దిష్ట, విప్లవాత్మక విధానాలను అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. “అమూల్యమైన ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టుకోవడం కోసం కచ్చితంగా మనం నిర్దిష్ట విప్లవ పంథాలో కృషిచేయాలి” అని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.
వాల్మీకి రామాయణం కన్నడ అనువాద ప్రతి ఆవిష్కరణ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ శకం ఆకర్షణలకు దూరంగా, సుసంపన్న జాతీయ సాహిత్య వారసత్వంతో యువత తిరిగి చురుగ్గా అనుసంధానం కావాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. “యువతరాన్ని స్క్రీన్లకు దూరంగా ఉంచుతూ మన ఘనమైన కన్నడ సాహిత్యంతో ప్రగాఢంగా అనుసంధానించడం మనందరి బాధ్యత కాదా?” అని శ్రీ మోదీ ప్రశ్నించారు.
దేశంలో ‘స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం’ భావనను ప్రోత్సహిస్తూ, వివిధ ప్రత్యేక సందర్భాల్లో కానుకలివ్వడం కోసం స్థానిక హస్తకళలు, పట్టు, చందనం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి సూచించారు. తద్వారా దేశీయ కళాకారులకు చురుగ్గా మద్దతివ్వాలని పౌరులను కోరారు. “ఒక భారతీయుడి శ్రమతో రూపొందిన కళారూపాన్ని కానుకగా ఇవ్వడం ద్వారానూ మన సంస్కృతిని సుందరమైన రీతిలో ప్రోత్సహించవచ్చు. అదే సమయంలో స్థానిక కుటుంబాలకు ఎంతో కీలకమైన ఆర్థిక తోడ్పాటు ఇవ్వవచ్చు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
చివరగా- దేశం కోసం స్వామి వివేకానంద ప్రబోధిత దార్శనికత సాకారం దిశగా పూర్తి బాధ్యతను ప్రస్తుత తరానికి అప్పగిస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు. యువత సాధికారతకు ఈ స్మారక చిహ్నం భవిష్యత్ మార్గదర్శి కాగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. “ఈ బృహత్తర కర్తవ్య నిర్వహణలో నేటి నవ తరానికి ‘వివేక స్మారక’ ఒక నిరంతరం శక్తియుత వనరు కాగలదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను” అని పటిష్ట కార్యాచరణకు పిలుపునిస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.
***
Speaking at the inauguration of Viveka Smaraka at Sri Ramakrishna Ashrama in Mysuru.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
https://t.co/IqVEAM1gy9
Swami Vivekananda truly embodied the spirit of India. pic.twitter.com/gTNpyET9qX
— PMO India (@PMOIndia) August 1, 2026
India's youth are driving global growth. pic.twitter.com/qhOcHyFI7U
— PMO India (@PMOIndia) August 1, 2026
It is for today's generation to turn Swami Vivekananda's vision of India into reality. pic.twitter.com/oK58ejuZpg
— PMO India (@PMOIndia) August 1, 2026
Mysuru held an important place in Swami Vivekananda’s life.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
I am confident that the Viveka Smaraka will become a vibrant place for inspiring the youth to contribute to a better society. pic.twitter.com/zEnyDGIACK
Powered by the capabilities of our youth, India is making strides across various sectors. The energy of our young people is the driving force behind the success of initiatives such as Aatmanirbhar Bharat and ‘Make in India.’ pic.twitter.com/3aFDgucT7f
— Narendra Modi (@narendramodi) August 1, 2026
I am delighted that the National Education Policy is preparing our nation’s youth to meet the needs and aspirations of the 21st century. pic.twitter.com/C0wCO1F888
— Narendra Modi (@narendramodi) August 1, 2026
A special appeal… pic.twitter.com/i9R2zPi9Bb
— Narendra Modi (@narendramodi) August 1, 2026
ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಮೈಸೂರು ಪ್ರಮುಖ ಸ್ಥಾನವನ್ನು ಪಡೆದಿತ್ತು.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
ಉತ್ತಮ ಸಮಾಜಕ್ಕೆ ಕೊಡುಗೆ ನೀಡಲು ಯುವಕರನ್ನು ಪ್ರೇರೇಪಿಸುವ ಚೈತನ್ಯದಾಯಕ ಸ್ಥಳವಾಗಿ ವಿವೇಕ ಸ್ಮಾರಕ ಹೊರಹೊಮ್ಮಲಿದೆ ಎಂಬ ವಿಶ್ವಾಸ ನನಗಿದೆ. pic.twitter.com/8fGr0CCXBs
ನಮ್ಮ ಯುವಕರ ಸಾಮರ್ಥ್ಯದಿಂದ ಭಾರತವು ವಿವಿಧ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ದಾಪುಗಾಲು ಹಾಕುತ್ತಿದೆ. ನಮ್ಮ ಯುವಜನರ ಬಲವೇ ಆತ್ಮನಿರ್ಭರ ಭಾರತ ಮತ್ತು ಮೇಕ್ ಇನ್ ಇಂಡಿಯಾದಂತಹ ಉಪಕ್ರಮಗಳ ಯಶಸ್ಸಿನ ಹಿಂದಿನ ಪ್ರೇರಕ ಶಕ್ತಿಯಾಗಿದೆ. pic.twitter.com/azduelKqKq
— Narendra Modi (@narendramodi) August 1, 2026
ರಾಷ್ಟ್ರೀಯ ಶಿಕ್ಷಣ ನೀತಿಯು 21ನೇ ಶತಮಾನದ ಅಗತ್ಯಗಳು ಮತ್ತು ಆಕಾಂಕ್ಷೆಗಳನ್ನು ಪೂರೈಸಲು ನಮ್ಮ ರಾಷ್ಟ್ರದ ಯುವಕರನ್ನು ಸಜ್ಜುಗೊಳಿಸುತ್ತಿರುವುದು ನನಗೆ ಸಂತಸ ತಂದಿದೆ. pic.twitter.com/9Cbsidnbnz
— Narendra Modi (@narendramodi) August 1, 2026
ಒಂದು ವಿಶೇಷ ಮನವಿ... pic.twitter.com/u9br1QKPqX
— Narendra Modi (@narendramodi) August 1, 2026