పిఎంఇండియా
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్2026లో జూడోలో బంగారు పతకం సాధించిన హర్ష్ సింగ్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
భారత జూడో చరిత్రలో ఇది చరిత్రాత్మక రోజని ప్రధానమంత్రి అభివర్ణించారు. హర్ష్ సింగ్ అసాధారణ ప్రదర్శన ద్వారా అతని ఆసక్తి, అంకితభావం స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.
భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘ పోస్టులో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
“భారత జూడో చరిత్రలో అపూర్వమైన రోజు!
స్వర్ణం గెలిచిన హర్ష్ సింగ్కు అభినందనలు. అతని అసాధారణ ప్రదర్శన ద్వారా ఆటపై ఆసక్తి, అంకితభావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా“.
Historic Day for Indian Judo!
— Narendra Modi (@narendramodi) July 31, 2026
Congrats to Harsh Singh for winning a Gold. His passion and dedication are clearly reflected in the exceptional performance. Best wishes for the upcoming endeavours.#CWG2026