Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్వెల్త్ గేమ్స్-2026 పురుషుల 100 మీటర్ల టి47 విభాగంలో స్వర్ణం గెలిచిన దిలీప్ మహాదు గావిత్‌ను అభినందించిన ప్రధానమంత్రి


  కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 100 మీటర్ల టి47 ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన దిలీప్ మహాదు గావిత్‌కు  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అభినందనలు తెలిపారు.

దిలీప్ మహాదు గావిత్ అద్భుతమైన టైమింగ్‌తో కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పడం ద్వారా, ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఆయన వేగం, పట్టుదల, అంకితభావం దేశానికి గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఒక పోస్టులో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“దిలీప్ మహాదు గావిత్ అద్భుత ప్రదర్శన!

పురుషుల 100 మీటర్ల టి47 ఈవెంట్‌లో అద్భుతమైన టైమింగ్‌తో స్వర్ణ పతకం గెలుచుకుని, సరికొత్త రికార్డును నెలకొల్పడం ద్వారా, ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను సాధించినందుకు అతనికి అభినందనలు. అతని వేగం, పట్టుదల, అంకితభావం మన దేశానికి గర్వకారణం. అతని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు!

 

***