పిఎంఇండియా
కార్మిక సంఘాల గుర్తింపు నకు సంబంధించి నియమాల రూపకల్పన కై కార్మిక సంఘాల చట్టం, 1926 లో సవరణ లు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు:
ఈ ఆమోదం తో-
కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి లలో కార్మిక సంఘాల గుర్తింపు నకు మార్గం సుగమం కాగలదు;
త్రైపాక్షిక సంఘాల లో శ్రామికుల కు వాస్తవ ప్రాతినిధ్యానికి బాట పడగలదు;
శ్రామిక ప్రతినిధులను ప్రభుత్వం తనకు తానుగా నామనిర్దేశం చేయడానికి అడ్డుపెట్టడం సాధ్యపడగలదు; ఇంకా,
వ్యాజ్యాలను మరియు పారిశ్రామిక అశాంతి ని కూడా తగ్గేందుకు ఆస్కారం ఉండగలదు.
శ్రామికుల ప్రతినిధులను త్రైపాక్షిక సంఘాల కు ప్రభుత్వం నామినేట్ చేసే ప్రక్రియ మరింత పారదర్శకం గా ప్రతిపాదిత బిల్లు మార్చివేయగలుగుతుంది. ఆ విధం గా గుర్తింపు ను పొందిన ట్రేడ్ యూనియన్ లు పారిశ్రామిక సామరస్యాన్ని పరిరక్షించడం లో జవాబుదారుగా ఉండగలవు. కేంద్ర/ రాష్ట్ర స్థాయి లలో కార్మిక సంఘాల గుర్తింపు వివిధ విభాగాలు ఆ తరహా అభ్యాసాన్ని మోసగించేందుకు వాడుకోవడాన్ని నిరోధించగలుగుతుంది. గుర్తింపు పొందినటువంటి కార్మిక సంఘాలకు కేంద్ర స్థాయిలోనో, రాష్ట్ర స్థాయి లోనో నిర్దిష్ట భూమిక లను కేటాయించే ఆస్కారం కూడా ఉంటుంది.