Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘గ్లాస్గో కామన్వెల్త్-2026’ క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి


‘గ్లాస్గో కామన్వెల్త్-2026’ క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

పట్టుదల, సంకల్పం, ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలనే స్ఫూర్తి తో క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారనే విశ్వాసాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు. 

క్రీడాకారుల నైపుణ్యాలు, వారి అంకితభావం ఎల్లప్పుడూ అనేక మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘గ్లాస్గో కామన్వెల్త్ 2026 పోటీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో భారత బృందానికి నా శుభాకాంక్షలు.

పట్టుదల, సంకల్పం, ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలనే స్ఫూర్తితో మన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని విశ్వసిస్తున్నాను.

మన క్రీడాకారుల నైపుణ్యం, అంకితభావం అనేక మంది భారతీయులకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.’’

 

***