Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.

“ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నాడు ఆయనకు నేను ప్రణమిల్లుతున్నాను. ఆయన వంటి పరాక్రమవంతుడు, ఒక మహానుభావుడు మన దేశంలో జన్మించినందుకు భారతదేశం గర్వపడుతోంది.

శివాజీ మహరాజ్ తన ప్రజల శ్రేయస్సును మిగతా అన్నింటి కన్నా మిన్నగా భావించారు. ఆయన అసాధారణమైన పరిపాలనా నైపుణ్యం మూర్తీభవించిన ఆదర్శప్రాయుడైన పాలకుడు.

శివాజీ మహరాజ్ యొక్క ఆదర్శాలను నెరవేర్చడం కోసం, ఆయన గర్వపడే భారతావనిని ఆవిష్కరించడం కోసం మేము అలుపెరగకుండా కృషి చేస్తున్నాము.

ఈ మధ్యే అరేబియా సముద్రతీరానికి ఆవల జరిగిన శివాజీ మహరాజ్ విగ్రహానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొనే గౌరవం నాకు దక్కింది. ఆ రోజును నేను ఎప్పటికీ మనసులో పదిలపరచుకొంటాను” అని ప్రధాన మంత్రి అన్నారు.