పిఎంఇండియా
దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే అద్భుతమైన ఘనతను సాధించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ‘తల్లి పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంతో ముడిపడి ఉన్న ఈ అద్భుత విజయం పర్యావరణ పరిరక్షణకు ప్రజలు ఎంతగా కట్టుబడి ఉన్నారో స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్కే కాకుండా యావత్ దేశానికి హరిత భవిష్యత్తును అందించడంలో ఎంతగానో దోహదపడతాయని, ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని ప్రధాని దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“దేశప్రజలందరికీ స్ఫూర్తినిచ్చే ఈ అద్భుతమైన ఘనతను సాధించినందుకు ఉత్తరప్రదేశ్లోని నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు! ‘తల్లి పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంతో ముడిపడి ఉన్న ఈ అద్భుత విజయం పర్యావరణ పరిరక్షణ కోసం నేడు ప్రజలు ఎంతగా కట్టుబడి ఉన్నారో స్పష్టంగా తెలియజేస్తోంది. ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్తో పాటు యావత్ దేశ హరిత భవిష్యత్తును సాకారం చేయడంలో ఎంతగానో దోహదపడతాయని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను.”
हर देशवासी को प्रेरित करने वाली इस शानदार उपलब्धि के लिए उत्तर प्रदेश के मेरे सभी परिवारजनों को बहुत-बहुत बधाई! 'एक पेड़ माँ के नाम' अभियान से जुड़ी यह अद्भुत सफलता बताती है कि आज पर्यावरण संरक्षण के लिए लोग पूरी तरह से प्रतिबद्ध हैं। मुझे पूरा विश्वास है कि इस तरह की पहल उत्तर… https://t.co/OyFhJo8s0O
— Narendra Modi (@narendramodi) June 5, 2026