పిఎంఇండియా
న్యూఢిల్లీ, జనవరి 23, 2015 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయనకు నివాళులు అర్పించారు. నేతాజీ ధైర్య సాహసాలు, దేశ భక్తి మనల్ని ఎల్లప్పుడూ ఉత్తేజ పరుస్తాయని, మనలో స్ఫూర్తిని నింపుతాయని ప్రధాని కొనియాడారు. ఆయన నాయకత్వ నైపుణ్యాలు, వ్యక్తిత్వం అసాధారణమని అన్నారు. ఆయన జన్మదిన సందర్భాన భరత మాత ముద్దు బిడ్డకు సగర్వంగా నమస్కరిస్తూ నివాళులు అర్పించారు.