Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ గారి ఆత్మకథ గ్రంథావిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ ముఖ్యాంశాలు


పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్మై లైఫ్మై స్ట్రగుల్స్’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తన ప్రసంగ ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ప్రజలతో పంచుకున్నారుపుస్తకం ముఖ్యాంశాల్ని శ్రీ మోదీ ప్రస్తావిస్తూశ్రీ కోవింద్ గారి స్ఫూర్తిదాయక పోరాటాల్నీవేర్వేరు భూమికల్లో ఆయన అందించిన విశిష్ట సేవల్నీప్రజాసేవా రంగంలో ఆయన కనబరిచిన తీవ్ర నిబద్ధతనీ పుస్తకం చాలా చక్కగా వివరించిందన్నారుఈ అంశాలు భారతీయులందరికీ స్ఫూర్తినిస్తాయనీదేశ ప్రజాస్వామ్యానికి ఉన్న నిజమైన శక్తికి అద్దం పడతాయనీ శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కొన్ని సందేశాలను ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘
పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ గారి ఆత్మకథ ‘‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్మై లైఫ్మై స్ట్రగుల్స్’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందిభారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న వాస్తవమైన బలాలనుభారతీయ ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశాలను ఈ పుస్తకం చాటిచెబుతోంది’’.
‘‘
పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ జీ రాసిన ఈ పుస్తకం స్ఫూర్తిని ఇవ్వడంతో పాటు ఎంపీగాగవర్నరుగారాష్ట్రపతిగా ఆయన ఇబ్బందులనీఅందించిన సేవల్నీతోడ్పాటునీ గొప్పగా ప్రస్తావించింది’’.
‘‘
ప్రజలకు సేవ చేయడాన్ని శ్రీ రామ్‌నాథ్ కోవింద్ గారు జీవనపథంగా ఎంచుకున్నారుకర్తవ్య దీక్షకే జీవితాన్ని అంకితం చేశారుఆయన అంకితభావంసేవ చేయాలన్న ఉత్సాహం భారత్‌లో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని ఇస్తాయి’’ అని పేర్కొన్నారు.

 

***