Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రకృతి పరిరక్షణ, గౌరవించడంలో మానవ సంక్షేమం: ప్రధానమంత్రి


ప్రకృతిని రక్షించడంతో పాటు గౌరవించడంలో మానవాళి సంక్షేమం ఇమిడి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుఈ ధర్మసమ్మత జీవన మార్గాన్ని అనుసరించడమే కాకుండాప్రకృతితో సద్భావనను కలిగివుంటూ మనుగడ సాగించే స్ఫూర్తిని భారత్ అనాదిగా పాటిస్తున్న సంప్రదాయాలు కూడా మనకు అందిస్తున్నాయని ఆయన అన్నారు.
‘‘
లోకపాలాశ్చ తే సర్వే వాసవప్రముఖాస్తథారుతవః షట్ చ తే సర్వే మాసాః సంవత్సరాః క్షపాఃదినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వన్తు తే సదాశ్రుతిః స్మృతిశ్చ ధర్మశ్చ పాతు త్వాం పుత్ర సర్వతః’’ అనే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.

ప్రకృతితో సద్భావననీధర్మసమ్మతినీ కలిగి ఉండే జీవన విధానం సంతోషానికీభద్రతకీశ్రేయానికీ ఆధారంగా నిలుస్తుందిదిక్కులను సంరక్షించే వారూఇంద్రుని నాయకత్వంలో ప్రముఖ దేవతలూఆరు రుతువులూఅన్ని నెలలూసంవత్సరాలూరాత్రులూపగళ్లూశుభ ఘడియలూ ఎల్లవేళలా ఆశీస్సుల్నీసౌభాగ్యాన్నీ అందించు గాకవేదాలుపవిత్ర సంప్రదాయాలుధర్మబద్ధ నడవడిక.. ఇవి అన్ని కాలాల్లోనూఅన్ని విధాలుగానూ అందరినీ కాపాడు గాక’ అని ఈ సుభాషితం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘
ప్రకృతిని సంరక్షించడంలోగౌరవించడంలో మానవ సంక్షేమం ఇమిడి ఉందిమన సంప్రదాయాలు కూడా ఈ ధర్మసమ్మత ఆచరణకు మొగ్గు చూపే స్ఫూర్తిని మనకు అందిస్తున్నాయి.
‘‘
లోకపాలాశ్చ తే సర్వే వాసవప్రముఖాస్తథారుతవః  షట్ చ తే సర్వే మాసాః సంవత్సరాః క్షపాఃదినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వన్తు తే సదాశ్రుతిః స్మృతిశ్చ ధర్మశ్చ పాతు త్వాం పుత్ర సర్వతః’’ అని పేర్కొన్నారు.

 

***************

MJPS/SS/ST