Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి రోహ్ తక్ లోని జాతీయ యువజనోత్సవం ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు రోహ్ తక్ లోని జాతీయ యువజనోత్సవం ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

ఎవరైనా యౌవన కాలంలో ఏమి సాధించగలరనే దానిని స్వామి వివేకానంద జీవితం నిరూపించిందని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు. యువతీయువకులు ఈ రోజు చేస్తున్న పనులు దేశ భవిష్యత్తు పైన ప్రభావాన్ని ప్రసరించగలుగుతాయని కూడా ఆయన చెప్పారు.

‘యూత్ ఫర్ డిజిటల్ ఇండియా’ అనేది ఈ ఉత్సవ ఇతివృత్తంగా ఉండడం పట్ల ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నగదు రహిత లావాదేవీల సంఖ్య పెరగడంలో ప్రజలకు మార్గదర్శకత్వం వహించవలసిందిగా యువతీయువకులకు ఆయన సూచించారు. అవినీతి మరియు నల్లధనం మన దేశ పురోగతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

సాంకేతిక విజ్ఞానం చూపుతున్న ప్రభావం కారణంగా కాలమాన పరిస్థితులు మారాయని, సమష్టితత్త్వం, అనుసంధానం మరియు సృజనాత్మకతలు ఇప్పుడు ఎంతో అవసరమైనవి అని ప్రధాన మంత్రి అన్నారు. అవినీతిపై జరుగుతున్న పోరాటంలో యువత నుండి లభిస్తున్న అండదండలు దేశంలో సకారాత్మకమైన పరివర్తనను తీసుకురావడం సాధ్యమేనని తనను ఒప్పిస్తున్నాయని ఆయన చెప్పారు.

***