పిఎంఇండియా
ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ పశ్చిమ ఆసియాలో ప్రస్తుత స్థితిపై చర్చించారు. హర్మూజ్ జలసంధిలో భద్రతను పునరుద్ధరించడం, నౌకాయాన స్వతంత్రతను నిర్ధారించ వలసిన అవసరం ఎంతైనా ఉందని వారు అంగీకరించారు.
ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతానికి వెలుపలా శాంతిని, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో సన్నిహిత సహకారాన్ని ఇకమీదట కూడా కొనసాగిద్దామంటూ నేతలిద్దరూ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:..
‘‘నా ప్రియ మిత్రుడు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ నాకు ఫోన్ చేశారు. మేం పశ్చిమ ఆసియాలో స్థితిపై చర్చించాం. హర్మూజ్ జలసంధిలో భద్రత, నౌకాయాన స్వతంత్రతను వెనువెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంగీకరించాం.
ఆ ప్రాంతంతో పాటు ఆ ప్రాంతం వెలుపల కూడా శాంతిని, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా మేం సన్నిహిత సహకారాన్ని ఇక ముందు కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు.
***
Received a phone call from my dear friend President Emmanuel Macron. We discussed the situation in West Asia and agreed on the need to urgently restore safety and freedom of navigation in the Strait of Hormuz.
— Narendra Modi (@narendramodi) April 16, 2026
We will continue our close cooperation to advance peace and stability…