Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బీహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని


బీహార్‌లోని లఖిసరాయ్‌లో తొక్కిసలాట కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం సాయం అందిస్తోందని ప్రధాని తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

‘‘బీహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన తొక్కిసలాటలో సంభవించిన ప్రాణనష్టం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ విషాద సమయంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు స్థానిక యంత్రాంగం సాయం అందిస్తోంది.’’

 

***

MJPS/SS/PRK