Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మొదటి రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు : భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కృషికి ప్రధాని వందనం


మొట్టమొదటి రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఈ సందర్భంగా ప్రధాన మంత్రి వందనం చేశారు.

” చరిత్రాత్మకమైన మొదటి రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. రాజ్యాంగం గురించి తెలుసుకునేందుకు ఈ ప్రత్యేక రోజు మీలో స్ఫూర్తి నింపుతుందని ఆకాంక్షిస్తున్నా.

మనం అంతా గర్వించదగిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప మేధావులకు ఘనమైన నివాళి అందించేందుకే ఈ ప్రత్యేక దినం.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషిని గుర్తుచేసుకోకుంటే మన రాజ్యాంగం ప్రస్తావనే ఉండదు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆయనకు వందనం.

మన రాజ్యాంగ విలువలను, సిద్ధాంతాలను గౌరవించాలి. మన పూర్వీకులు గర్వించదగిన భారతావనిని నిర్మించాలి ” అని ప్రధాని పేర్కొన్నారు.