Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రామ్ చరిత్ మానస్ డిజిటల్ వెర్షన్ ను విడుదల చేసిన ప్రధాని

రామ్ చరిత్ మానస్ డిజిటల్ వెర్షన్ ను విడుదల చేసిన ప్రధాని

రామ్ చరిత్ మానస్ డిజిటల్ వెర్షన్ ను విడుదల చేసిన ప్రధాని

రామ్ చరిత్ మానస్ డిజిటల్ వెర్షన్ ను విడుదల చేసిన ప్రధాని

రామ్ చరిత్ మానస్ డిజిటల్ వెర్షన్ ను విడుదల చేసిన ప్రధాని

రామ్ చరిత్ మానస్ డిజిటల్ వెర్షన్ ను విడుదల చేసిన ప్రధాని

రామ్ చరిత్ మానస్ డిజిటల్ వెర్షన్ ను విడుదల చేసిన ప్రధాని

రామ్ చరిత్ మానస్ డిజిటల్ వెర్షన్ ను విడుదల చేసిన ప్రధాని

రామ్ చరిత్ మానస్ డిజిటల్ వెర్షన్ ను విడుదల చేసిన ప్రధాని


ఆల్ ఇండియా రేడియో రూపొందించిన రామ్చరిత్మానస్ డిజిటల్ వెర్షన్ సీడీల సెట్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేశారు. ఈ సంగీత గ్రంథాన్ని రూపొందించటంలో భాగస్వాములైన కళాకారులను, వారి శ్రమను ప్రధానమంత్రి కొనియాడారు. ఇది కేవలం సంగీత సాధన మాత్రమే కాదని. సంస్కృతీ సాంప్రదాయాల మేళవింపుతో రూపొందించారని ప్రశంసించారు. రామ్చరిత్మానస్ భారతదేశ తత్వాన్ని, సారాంశాన్ని ప్రతిబింబించే గొప్ప గ్రంథంగా ప్రధాని అభివర్ణించారు.

మారిషస్తోపాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన భారతీయులు తరతరాలుగా అక్కడినుంచే భారతదేశంతో సంబంధాలను సజీవంగా ఉంచేందుకు రామ్చరిత్మానసే ప్రధాన కారణమన్నారు. భారతదేశంలో ఐక్యతా భావాన్ని, సమాచారాన్ని, అవగాహనను పెంపొందించటంలో ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి పాత్ర ప్రభావవంతమైనదని ప్రధాని మోదీ అభినందించారు.

దేశవ్యాప్తంగా వివిధ కళాకారులు ప్రదర్శించిన దాదాపు 9లక్షల గంటల సంగీత రికార్డింగ్స్ ఆల్ ఇండియా రేడియో దగ్గర ఉన్నట్లు అధికారులు చెప్పారని మోదీ తెలిపారు. దేశ శ్రేయస్సు కోసం వీటన్నింటినీ ఒక డాక్యుమెంట్ లాగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, ప్రసార భారతి బోర్డు చైర్మన్ శ్రీ సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

*****

MVVS/PR/ARDHA