పిఎంఇండియా
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల చొప్పున అందజేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. గాయపడిన ప్రతి ఒక్కరికీ రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను. బాధితులకు స్థానిక అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారు.
మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సహాయం అందిస్తాం: ప్రధాని”
***
Saddened by the mishap at the Visakhapatnam Steel Plant. Condolences to those who have lost their loved ones. Praying that the injured recover at the earliest. The local authorities are providing all possible assistance to those affected.
— PMO India (@PMOIndia) June 8, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF…