పిఎంఇండియా
శ్రీమతి విజయ మెహతా జీ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. శ్రీమతి విజయ మెహతా గారు ఆధునిక మరాఠీ నాటక రంగ మార్గదర్శకుల్లో ఒకరనీ, సృజనాత్మకతకీ, కళాకౌశలానికీ మరో పేరనీ శ్రీ మోదీ ప్రశంసించారు. ఆమె నాటకాలూ, సినిమాలూ వివిధ తరాల నటులపైనా, దర్శకులపైనా, రంగస్థల ప్రేమికులపైనా ప్రభావాన్ని చూపాయని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘శ్రీమతి విజయ మెహతా గారు ఇక లేరని తెలిసి ఎంతో బాధపడ్డాను. సాంస్కృతిక రంగంతో పాటు చలనచిత్ర రంగంలోనూ మహామహుల్లో ఒకరిగా ఆమెను స్మరించుకుంటూ ఉంటాం.
ఆధునిక మరాఠీ నాటక రంగ మార్గదర్శకుల్లో ఒకరైన శ్రీమతి విజయ మెహతా గారు సృజనాత్మకతకీ, కళా కౌశలానికీ ప్రసిద్ధి పొందారు. ఆమె నాటకాలూ, చలనచిత్రాలూ వివిధ తరాలకు చెందిన నటులకూ, దర్శకులకూ, రంగస్థల ప్రేమికులకూ స్ఫూర్తిని ఇచ్చాయి.
ఆమె కుటుంబానికీ, అభిమానులకీ, కళాకారులందరికీ ఈ విషాద వేళలో నేను సంతాపాన్ని తెలుపుతున్నాను. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.
***
Deeply saddened by the passing of Smt. Vijaya Mehta Ji. She will be remembered as one of the towering personalities of culture and cinema.
— Narendra Modi (@narendramodi) July 1, 2026
A pioneer of modern Marathi theatre, she was known for her creativity and commitment to artistic excellence. Her work inspired generations…
विजया मेहता जी यांच्या निधनाने अत्यंत दुःख झाले आहे. सांस्कृतिक आणि चित्रपट क्षेत्रातील एक उत्तुंग व्यक्तिमत्त्व म्हणून त्या सदैव स्मरणात राहतील.
— Narendra Modi (@narendramodi) July 1, 2026
आधुनिक मराठी रंगभूमीच्या त्या प्रणेत्या होत्या, सर्जनशीलता आणि कलात्मक उत्कृष्टता यांच्याप्रती असलेल्या निष्ठेसाठी त्या ओळखल्या जात…