Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సింగ‌పూర్ ప్ర‌ధానికి మోదీ బ‌హుమ‌తి

సింగ‌పూర్ ప్ర‌ధానికి మోదీ బ‌హుమ‌తి


భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సింగ‌పూర్ ప్ర‌ధాని లీ హెయిన్ లూంగ్ కు అరుదైన బ‌హుమ‌తి ఇచ్చారు. 1849నాటి సింగ‌పూర్ ప‌టం పునఃప్ర‌తిని ప్ర‌ధాని ఆయ‌న‌కు అందజేశారు. 1842-45 మ‌ధ్య‌కాలంలో జ‌రిగిన స‌ర్వే ఆధారం త‌యారైన 52*52 అంగుళాల ఈ ప‌టం అల‌నాటి సింగ‌పూర్ భూభౌతిక వివ‌రాల‌ను, అందులోని వివిధ ప్రాంతాల‌ను తెలియ‌జేస్తుంది. న్యూఢిల్లీలోని జాతీయ అభిలేఖ‌నాల‌యం పురాసేక‌ర‌ణ‌ల్లోంచి దీని పునఃప్ర‌తి త‌యారు చేశారు.