Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్కైరూట్ ఏరోస్పే‌స్‌కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాతో ప్రధానమంత్రి భేటీ


స్కైరూట్ ఏరోస్పేస్‌కు చెందిన పంవన్ చందననాగ భరత్ డాకాతో అద్భుతమైన చర్చ చేపట్టినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తెలిపారు

అనేక ఇతర ఆసక్తికరమైన అంశాలతో పాటుగా విక్రమ్–విజయం గురించి చర్చించినట్లు ప్రధానమంత్రి తెలియజేశారుఇప్పటి వరకు సాగిన వారి ప్రయాణంభవిష్యత్తు గురించి వారి ఆలోచనలను తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

వారి ఉత్సాహంఆశయంసానుకూల దృక్పథం… మన ప్రైవేటు అంతరిక్ష రంగం స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని శ్రీ మోదీ చెప్పారుమొత్తం స్కైరూట్ బృందానికి అభినందనలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఇలా అన్నారు:

‘‘స్కైరూట్ ఏరోస్పేస్‌కు చెందిన పవన్ చందననాగభరత్ డాకాతో అద్భుతమైన చర్చ జరిగింది.

మా చర్చలో విక్రమ్–విజయం గురించి సహజంగానే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిందిదీనితో పాటు అనేక ఆసక్తికరమైన అంశాల గురించి చర్చించాంవారి ప్రయాణం గురించిభవిష్యత్తు గురించి వారి ఆలోచనలను తెలుసుకోవడం ఆనందంగా ఉందివారి ఉత్సాహంలక్ష్యంసానుకూల దృక్పథం… ప్రైవేటు అంతరిక్ష రంగ స్ఫూర్తిని తెలియజేస్తోంది.

మొత్తం స్కైరూట్ బృందానికి శుభాకాంక్షలు’’

 

 

***

MJPS/SS/PRK