పిఎంఇండియా
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల హై జంప్ పోటీలో రజత పతకాన్ని గెలుచుకున్న సర్వేశ్ కుశారేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
సర్వేశ్ కుశారే దృఢ సంకల్పాన్నీ, అనేక సార్లు అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్న తీరునీ ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ విజయం అసాధారణ విజయమని ప్రధాని అన్నారు.
సర్వేశ్ను చూసి భారత్ ఆనందిస్తోందని శ్రీ మోదీ అన్నారు. రాబోయే కాలంలో కూడా సర్వేశ్ కుశారే మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని అభిలషించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల హై జంప్ పోటీలో అద్భుతమైన మరో రజత పతకాన్ని సర్వేశ్ కుశారే గెలుచుకున్నారు. ఆయన దృఢ సంకల్పంతో పాటు, వరుసగా శ్రేష్ఠ ప్రదర్శనను కనబరుస్తున్న తీరు ప్రశంసనీయం. ఈ అసాధారణ విజయానికి గాను ఆయనకు అభినందనలు. ఆయనను చూసి భారత్ సంతోషిస్తోంది. ముందు ముందు ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
***
A spectacular Silver for Sarvesh Kushare in Men’s High Jump at #CWG2026! His determination and consistency have been noteworthy. Congratulations to him on this outstanding achievement. India is proud of him. Wishing him many more successes ahead. pic.twitter.com/9JwypnM0Rb
— Narendra Modi (@narendramodi) July 28, 2026