పిఎంఇండియా
2026 కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత విజేతలతో 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అథ్లెట్లతో మాట్లాడి, వారి అనుభవాల గురించి తెలుసుకున్నారు.
అథ్లెట్లు సాధించిన విజయాలు యావత్ దేశానికి గర్వకారణమని, యువత క్రీడల వైపు ఆకర్షితులయ్యేందుకు ఈ విజయాలు స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
“2026 కామన్వెల్త్ గేమ్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలు సాధించిన విజేతలతో 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో సమావేశమవటం ఆనందంగా ఉంది. వారి అనుభవాలను స్వయంగా తెలుసుకున్నాను.
ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారు. వారి విజయం ఎంతో మంది యువతకు స్ఫూర్తి“
***
Delighted to host our outstanding medal winners from the Commonwealth Games 2026 at 7, Lok Kalyan Marg. Heard about their experiences from the Games.
— Narendra Modi (@narendramodi) August 9, 2026
Each one of them has made our nation proud through their exceptional performances. Their success will motivate many youngsters. pic.twitter.com/1zkYCKiV8r
Always #Cheer4Bharat. pic.twitter.com/eSjh8o1Ris
— Narendra Modi (@narendramodi) August 9, 2026