Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించినందుకు దేశానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి పెరుగుతున్న ఆర్థిక విశ్వాసం గురించి ప్రస్తావన


ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 7.8 శాతం వృద్ధి రేటును సాధించినందుకు గాను దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వీడియో సందేశంలో బలమైన ఆర్థిక గణాంకాల గురించి ప్రధానమంత్రి పంచుకున్నారు. పెరుగుతున్న ఆర్థిక విశ్వాసాన్ని ఈ సంఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

“7.8 శాతం వృద్ధి.

బలమైన గణాంకాలు.

మరింత బలోపేతమైన విశ్వాసం.”