Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్క్వాష్ ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత బృందానికి ప్రధాని శుభాకాంక్షలు


ఎస్‌డీఏటీ స్క్వాష్ ప్రపంచ కప్ – 2025లో మొదటిసారి ప్రపంచ కప్ సాధించి చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
జోష్న చిన్నప్పఅభయ్ సింగ్వేలవన్ సెంథిల్ కుమార్అనాహత్ సింగ్ చేసిన అద్భుతమైన ప్రదర్శనను శ్రీ మోదీ కొనియాడారువారి అంకిత భావంక్రమశిక్షణసంకల్పం దేశాన్ని గర్వంతో ఉప్పొంగిపోయేలా చేసిందన్నారుఅంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న భారతీయ క్రీడా సామర్థ్యాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తోందని ఆయన తెలియజేశారు.

ఈ విజయం దేశవ్యాప్తంగా అనేక మంది యువ అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందనిదేశ యువతలో స్క్వాష్ పట్ల ఆసక్తిని మరింత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:
‘‘
ఎస్‌డీఏటీ స్క్వాష్ ప్రపంచ కప్-2025లో మొదటి సారి ప్రపంచ కప్ సాధించి చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ బృందానికి అభినందనలు!

జోష్న చిన్నప్పఅభయ్ సింగ్వేలవన్ సెంథిల్ కుమార్అనాహత్ సింగ్ అద్భుతమైన అంకితభావాన్నిసంకల్పాన్ని ప్రదర్శించారువారి విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిందిఅలాగే యువతలో స్క్వాష్ పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది.

 

***