Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నాయకులకు ప్రధాని శుభాకాంక్షలు


రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్‌పీఅధ్యక్షుడు శ్రీ రబీ లామిఛానేఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బాలేంద్ర షాతో టెలిఫోన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మాట్లాడారు.

నేపాల్ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు నాయకులకుఘన విజయం సాధించిన ఆర్ఎస్పీకి అభినందనలు తెలిపారుత్వరలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారురెండు దేశాల పరస్పర సంక్షేమంపురోగతిప్రజల శ్రేయస్సు కోసం కలసి పనిచేయడానికి భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

భారత్నేపాల్ సంబంధాల భవిష్యత్తుపై విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేస్తూ.. రానున్న కాలంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఉమ్మడి ప్రయత్నాలతో నూతన శిఖరాలకు చేరుకుంటుందన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీఅధ్యక్షుడు శ్రీ రబీ లామిఛానేఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బాలేంద్ర షాతో టెలిఫోన్‌లో మాట్లాడాను.

నేపాల్ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు నాయకులకుఘన విజయం సాధించిన ఆర్ఎస్‌పీకీ అభినందనలు తెలియజేశానుత్వరలో ఏర్పాటు కానున్న నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపానుఅలాగే రెండు దేశాల పరస్పర సంక్షేమంపురోగతిశ్రేయస్సు కోసం కలసి పనిచేయడానికి భారత ప్రభుత్వ నిబద్దతను తెలియజేశాను.

మా ఉమ్మడి ప్రయత్నాలతో రానున్న కాలంలో భారత్నేపాల్ మధ్య సంబంధాలు నూతన శిఖరాలకు చేరుకుంటాయని విశ్వసిస్తున్నాను.

 

***