పిఎంఇండియా
జీవితంలో విజయ సాధనకు కీలకం దృఢ సంకల్పం, సంయమనంతో పాటు ఆత్మవిశ్వాసాల కలయిక కీలకమని టీమ్ ఇండియా టీ20 క్రికెట్ ప్రపంచ కప్పును గెలుచుకొని నిరూపించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సరైన దిశగా నిరంతర శ్రమ చేస్తూ ఉంటే ప్రతి లక్ష్యాన్నీ సాధించడం సాధ్యపడుతుందని కూడా ఈ విజయం రుజువు చేసిందని ఆయన అన్నారు.
సంస్కృత భాషలోని ఈ కింది సుభాషితాన్ని ప్రజలతో ప్రధాని పంచుకున్నారు:
‘‘అభీప్సాం స్వాత్మనో రక్షావిరతం సుస్థిరం తయా
యత్నమాతిష్ఠ ధైర్యేణ తత: సిద్ధిర్భవేద్ ధ్రువమ్’’.
ఎవరైనా జీవితంలో పురోగతిని సాధించాలని కోరుకుంటే పట్టుదలతోనూ, దృఢ నిశ్చయంతోనూ గట్టిగా కృషి చేయాలి. నిరంతర కఠిన శ్రమకు సంయమనం తోడయితే విజయానికి తప్పక బాటను పరుస్తుందని ఈ సుభాషితం సూచిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘టీ20 క్రికెట్ వరల్డ్ కప్పును టీమ్ ఇండియా గెలిచి, దృఢ సంకల్పం, సంయమనం, ఆత్మవిశ్వాసాల సంగమమే జీవితంలో సఫలతకు మూల మంత్రమని రుజువు చేసింది. సరైన దిశగా కఠిన పరిశ్రమ చేయడం ద్వారా ప్రతి లక్ష్యాన్నీ చేజిక్కించుకోవచ్చని కూడా ఈ విజయం చాటిచెబుతోంది.
‘‘అభీప్సాం స్వాత్మనో రక్షావిరతం సుస్థిరం తయా
యత్నమాతిష్ఠ ధైర్యేణ తత: సిద్ధిర్భవేద్ ధ్రువమ్’’ అని పేర్కొన్నారు.
***
T20 क्रिकेट वर्ल्ड कप जीतकर टीम इंडिया ने साबित कर दिया है कि दृढ़ संकल्प, संयम और आत्मविश्वास का संगम ही जीवन में सफलता का मूलमंत्र है। यह जीत हमें यह भी बताती है कि सही दिशा में कठिन परिश्रम से हर लक्ष्य को हासिल किया जा सकता है।
— Narendra Modi (@narendramodi) March 9, 2026
अभीप्सां स्वात्मनो रक्षाऽविरतं सुस्थिरं तया।… pic.twitter.com/XrUhXbp0tm