పిఎంఇండియా
దేశ సైనికుల అసాధారణ శౌర్యానికీ, వారి దేశభక్తికీ ఆపరేషన్ సింధూర్లో భారత్ సాధించిన అసాధారణ విజయమే స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వారి ధైర్యానికీ, దృఢ సంకల్పానికీ, అచంచలమైన కర్తవ్య స్ఫూర్తికీ ప్రతి పౌరుడూ గర్వపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత సుభాషితం–
‘‘ఉదీర్ణమనసో యోధా వాహనాని చ భారత।
యస్యాం భవంతి సేనాయాం ధ్రువం తస్యాం జయం వదేత్।।’’
స్ఫూర్తి, ధైర్యం, మనోనిబ్బరం, గొప్ప వనరులను కలిగి ఉన్న సైన్యం కచ్చితంగా విజయం సాధిస్తుందని ఈ సుభాషితం తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘మన సైనికుల అసాధారణ శౌర్యానికీ, దేశభక్తికీ ఆపరేషన్ సింధూర్లో భారతదేశం సాధించిన విజయం ఓ స్పూర్తిదాయకమైన ఉదాహరణ. వారి ధైర్యానికీ, సంకల్పానికీ, అంకితభావానికీ దేశంలోని ప్రతి పౌరుడూ గర్వపడుతున్నారు.
ఉదీర్ణమనసో యోధా వాహనాని చ భారత।
యస్యాం భవంతి సేనాయాం ధ్రువం తస్యాం జయం వదేత్।।
ऑपरेशन सिंदूर में भारत को मिली असाधारण विजय हमारे वीर सैनिकों के अद्भुत पराक्रम और देशभक्ति की प्रेरक मिसाल है। उनके अदम्य साहस, दृढ़ संकल्प और कर्तव्यनिष्ठा पर हर देशवासी को गर्व है।
— Narendra Modi (@narendramodi) May 7, 2026
उदीर्णमनसो योधा वाहनानि च भारत।
यस्यां भवन्ति सेनायां ध्रुवं तस्यां जयं वदेत्।।… pic.twitter.com/SBZ9EyjIP6