పిఎంఇండియా
లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలు అందించిన డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని తెలిపారు.
డాక్టర్ కశ్యప్ భారత్లో ప్రముఖ రాజ్యాంగ కోవిదులలో ఒకరనీ, పార్లమెంటుకు సంబంధించిన కార్యకలాపాలతో పాటు రాజ్యాంగ పరమైన విధుల నిర్వహణలో ఆయన అందించిన తోడ్పాటు మన సమాజాన్ని సుసంపన్నం చేసిందనీ ప్రధానమంత్రి అన్నారు. డాక్టర్ కశ్యప్ రచనలూ, ప్రజాస్వామిక సంస్థలను పటిష్ఠపరచడంలో ఆయన కనబరిచిన నిబద్ధత ప్రశంసనీయమని శ్రీ మోదీ అన్నారు. డాక్టర్ కశ్యప్ కుటుంబానికీ, స్నేహితులకీ ప్రధానమంత్రి సంతాపాన్ని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘లోక్సభ సెక్రటరీ జనరల్గా ఇంతకు ముందు సేవలు అందించిన డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. ఆయన భారత్లో ప్రముఖ రాజ్యాంగ కోవిదులలో ఒకరు. పార్లమెంటుకు సంబంధించిన కార్యకలాపాలతో పాటు రాజ్యాంగ పరమైన విధులలో ఆయన అందించిన తోడ్పాటు మన సమాజాన్ని సుసంపన్నం చేసింది. ఆయన రచనలతో పాటు ప్రజాస్వామిక సంస్థలను పటిష్ఠపరచడంలో ఆయన నిబద్ధత ప్రశంసనీయం. ఆయన కుటుంబానికీ, స్నేహితులకీ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.
***
Pained by the passing of Dr. Subhash C. Kashyap, who previously served as Secretary General of the Lok Sabha. He was one of India’s foremost constitutional scholars whose contributions to parliamentary and constitutional discourse enriched our society. His writings and commitment…
— Narendra Modi (@narendramodi) June 4, 2026