పిఎంఇండియా
పర్యావరణ పరిరక్షణలో ప్రశంసనీయమైన ఘనతను సాధించినందుకు అస్సాం ప్రజలకు, ముఖ్యంగా ఆ రాష్ట్ర నారీశక్తికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సుస్థిరమైన భూమండలాన్ని సాధించే లక్ష్యంతో చేపట్టిన ఈ గొప్ప ప్రయత్నంలో ఆ రాష్ట్ర నారీశక్తి ముందుండి నడిపించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
” ప్రశంసనీయమైన ఘనత. సుస్థిరమైన భూమండలాన్ని సాధించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయత్నంలో ముందుండి నడిచిన అస్సాం ప్రజలకు, ముఖ్యంగా ఆ రాష్ట్ర నారీశక్తికి నా హృదయపూర్వక అభినందనలు.”
Commendable feat. Congratulations to the people of Assam, especially the state’s Nari Shakti for taking the lead in this effort aimed at building a sustainable planet. https://t.co/VQJGWJzN46
— Narendra Modi (@narendramodi) June 5, 2026