Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ కోసం ఐక్యంగా, సమష్టిగా కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి


హింసాత్మక చర్యలతో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుదారి తప్పిన వారిని సరైన మార్గంలో నడిపించాలని పిలుపునిచ్చారు.

జంతర్ మంతర్ వద్ద జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ.. తనపైమరణించిన తన తల్లిపై అసభ్యపదజాలం ప్రయోగించటాన్ని దేశంప్రపంచం చూశాయని ప్రధానమంత్రి అన్నారుఅలాంటి ప్రవర్తనపై సమాజానికి ఆగ్రహం కలగటం సహజమే అని పేర్కొన్నారుబాల్యంలో తప్పులు జరుగుతాయని.. వాటి నుంచి నేర్చుకోవటానికిసరిదిద్దుకోవటానికి అవకాశం లభిస్తుందని అన్నారు.

దారి తప్పిన పిల్లలను శిక్షించటంకోర్టుల చుట్టూ తిప్పటంసమాజంలో వేధించటం వంటివి కాకుండా వారికి సరైన మార్గాన్ని చూపించాలని ప్రధానమంత్రి అన్నారువారిని క్షమించాలనుకుంటున్నట్లు ప్రధానమంత్రి తెలిపారుసమాజం కూడా ఈ భావనను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.

దేశం కోసం యువత ఐక్యంగా ముందుకు సాగాలనితప్పుల నుంచి నేర్చుకుంటూ కలలను సాకారం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారుదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందనిజీవితంలో యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

భారత్ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

యువతను సరైన మార్గంలో నడిపించాలన్న అంశంపై వీడియోను పంచుకుంటూ శ్రీ నరేంద్ర మోదీ ఇలా అన్నారు.

హింసాత్మక చర్యలతో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదు.

తప్పుదోవ పట్టిన వారికి సరైన మార్గాన్ని చూపిద్దాం.

మనమంతా కలిసి పనిచేద్దాం.

భారత్ కోసం పనిచేద్దాం

దూషణలతో సమస్యను పరిష్కరించలేం.

తప్పుదోవ పట్టిన వారికి సరైన మార్గాన్ని చూపిద్దాం.

మనమంతా కలిసి పనిచేద్దాం.

భారత్ కోసం పనిచేద్దాం pic.twitter.com/yAePG60KYL

నరేంద్ర మోదీ (@నరేంద్రమోదీజూలై 31, 2026