పిఎంఇండియా
ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు. శ్రీ మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి ప్రస్థానంలో ‘నీలి విప్లవం’ మరో విజయగాథగా మారుతోందని శ్రీ సీపీ రాధాకృష్ణన్ తన వ్యాసంలో పేర్కొన్నారు. భారత్ నేడు తన తీర ప్రాంతాలను దాటి సముద్ర వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతోందని ఈ కథనం పేర్కొంది. సుస్థిర మత్స్యరంగం ద్వారా తీర ప్రాంతాల్లోని ప్రజలు, యువత, మహిళలకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని, తద్వారా తీర ప్రాంత భారతదేశ ఆర్థిక జీవనం మరింత బలోపేతమవుతోందని ఆయన తెలిపారు.
సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
“ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ రాసిన ఈ కథనం తప్పక చదవాల్సినది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి ప్రస్థానంలో ‘నీలి విప్లవం’ మరో విజయగాథగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్ నేడు తన తీరప్రాంత సరిహద్దులను దాటి సముద్ర వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. సుస్థిర మత్స్యరంగం తీర ప్రాంతాల్లోని ప్రజలు, యువత, మహిళలకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని, ఇది తీర ప్రాంత భారతదేశ ఆర్థిక జీవనాన్ని కూడా బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు’’.
A must-read article by @VPIndia Thiru @CPR_VP, in which he writes that under PM @narendramodi's leadership, Bharat's growth story is making the Blue Revolution another success story.
— PMO India (@PMOIndia) September 17, 2026
He says India is now looking beyond its shores to unlock its marine wealth. Sustainable… pic.twitter.com/XyGGlkZWJ8