పిఎంఇండియా
కేంద్రీయ జాబితా లోని ఇతర వెనుకబడిన తరగతుల లోపల ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించడం కోసం రాజ్యాంగం లోని 340వ అధికరణం లో భాగం గా ఏర్పాటు చేసిన కమిశన్ యొక్క పదవీకాలాన్ని 2019వ సంవత్సరం జులై 31వ తేదీ అనంతరం ఆరు నెలలు మరియు 2020వ సంవత్సరం జనవరి 31వ తేదీ వరకు పొడిగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు
ప్రతిపాదిత పదవీకాలాన్ని విస్తరించడం కమిశన్ కు సంబంధిత వర్గాల తో సంప్రదింపులు జరిపిన తరువాత ఒబిసి ల ఉప వర్గీకరణ అంశం పైన ఒక విపుల నివేదిక ను సమర్పించేందుకు వీలు కల్పిస్తుంది.