Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమరువీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రద్ధాంజలి


అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ భగత్‌ సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు త్రయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా సందేశమిచ్చారు. “వారి అనితర త్యాగానికి రుణపడి ఉన్న దేశం కృతజ్ఞతాపూర్వకంగా వారిని సదా స్మరించుకుంటూనే ఉంటుంది… జైహింద్‌!” అని అందులో పేర్కొన్నారు.

****