Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో కాడర్ రివ్యూ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం


ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) గ్రూప్ ‘ఎ’ పునర్ నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

ఈ పునర్ నిర్మాణంలో భాగంగా అగ్ర స్థాయిలో రెండు పదవులను, హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లో 5 పదవులను, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్థాయి లో 19 పదవులను జోడిస్తారు. ఇతర స్థాయిలలో ఇదే మాదిరిగా తగ్గింపులు కూడా చోటు చేసుకొంటాయి. ఐఐఎస్ కాడర్ లో ప్రస్తుతం నెలకొన్న స్తబ్ధత సమస్యను ఈ పునర్ నిర్మాణం పరిష్కరించగలుగుతుంది. అలాగే, ఐఐఎస్ అధికారులకు వృత్తిపరమైన అవకాశాలను మెరుగుపరచగలుగుతుంది కూడా. ప్రభుత్వంలోని కమ్యూనికేషన్, ప్రసార మాధ్యమాల విభాగాలు మరింత మెరుగుగా పని చేసేటందుకు ఈ కాడర్ రివ్యూ కసరత్తు బాట పరుస్తుంది.

ప్రభుత్వం చేపడుతున్న ప్రజానుకూల విధానాలను మరింత ఎక్కువ మందికి చేర్చేటందుకు ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలోను, కొన్నేళ్ళుగా పుంఖానుపుంఖంగా అమలవుతున్న ప్రజానుకూల విధానాలకు సంబంధించిన సమాచారాన్ని బహుళవ్యాప్తం చేయవలసిన అవసరం ఉన్న తరుణంలోను ఈ కాడర్ రివ్యూ చోటు చేసుకోబోతోంది.

***