పిఎంఇండియా
మలేసియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ, సింగపూర్కు చెందిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ, జపాన్కు చెందిన జపాన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కోఆర్డినేషన్ సెంటర్ సంస్థలతో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సిఇఆర్ టి – ఇన్) అవగాహనపూర్వక ఒప్పందాలను (ఎంఓయు) కుదుర్చుకుంది. తద్వారా ఆయా దేశాలకు, ఇండియాకు మధ్య సైబర్ భద్రత రంగంలో సహకార ప్రక్రియ మొదలవుతుంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ఒప్పందాలకు సంబంధించిన అంశాలను చర్చించి, ఆమోదం తెలిపింది.
సైబర్ భద్రత కోసం చేసుకున్న ఈ మూడు ఎంఓయు ల వివరాలు ఇలా ఉన్నాయి:-
(i) ఇండియాకు చెందిన సిఇ ఆర్ టి-ఇన్ సంస్థకు మలేసియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థకు మధ్య అవగాహన పూర్వక ఒప్పందం పైన సంతకాలు 2015 నవంబర్ 23న మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగాయి. ఈ సంతకాలు మలేషియాలో ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా జరిగాయి.
(ii) ఇండియాకు చెందిన సిఇ ఆర్ టి-ఇన్ సంస్థకు సింగపూర్ దేశానికి చెందిన సింగపూర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (ఎస్ ఐ ఎన్ జి సిఇఆర్ టి), సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సిఎస్ ఏ) సంస్థలకు మధ్య అవగాహన పూర్వక ఒప్పందం పైన 2015 నవంబర్ 24న సింగపూర్ లో సంతకాలు జరిగాయి. ఈ సంతకాలు సింగపూర్ దేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా జరిగాయి.
(iii) సిఇఆర్ టి- ఇన్, జపాన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం కోఆర్డినేషన్ సెంటర్ (జెపిసిఇఆర్ టి/ సిసి) సంస్థలకు మధ్య 2015 డిసెంబర్ 7న ఎంఓయు పై సంతకాలు జరిగాయి. దౌత్యపరమైన మార్పిడిలో భాగంగా ఈ సంతకాలు జరిగాయి. సంతకాల ఎంఓయు ను ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం 22 డిసెంబర్ 2015 నాటికి ముగిసింది.
సైబర్ రంగంలో భద్రతకు సంబంధించిన ఈ ఎంఓయు ల ద్వారా భారత దేశానికి, సంబంధిత దేశాలకు మధ్య ఈ రంగానికి సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. భద్రతకు సంబంధించిన సమస్యల్ని గుర్తుపట్టడంలో, వాటిని పరిష్కరించడంలో ఆయా దేశాల మధ్య సహకారం కొనసాగుతుంది.