పిఎంఇండియా
ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెశ్కియన్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్లో మాట్లాడారు.
అధ్యక్షుడు శ్రీ పెజెశ్కియన్ ఇరాన్లో ప్రస్తుత స్థితితో పాటు ఆ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలపై తన దృష్టికోణాన్ని ప్రధానమంత్రికి వివరించారు.
ఆ ప్రాంతం భద్రత స్థితిలో మార్పులు చోటుచేసుకుంటున్న మార్పుపై ప్రధాని తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. అన్ని అంశాల్నీ చర్చ, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత్ స్థిర వైఖరి అని ఆయన పునరుద్ఘాటించారు.
ఇరాన్ సహా ఆ ప్రాంతంలోని భారత జాతీయుల భద్రతకీ, క్షేమానికీ, ఇంధనంతో పాటు వస్తువుల నిరంతరాయ రాకపోకలకు కూడా భారత్ ప్రాధాన్యాన్ని ఇస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.
తరచూ సంప్రదింపులు నిర్వహించుకోవాలని నేతలు ఇద్దరూ పరస్పరం అంగీకారాన్ని వ్యక్తం చేశారు.
***
Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region.
— Narendra Modi (@narendramodi) March 12, 2026
Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure.
The safety and security of…