పిఎంఇండియా
ఉత్సుకత, సకారాత్మక శక్తి… ఇవి మనుషులకు ఎప్పటికీ చురుకుగా ఉండే స్ఫూర్తిని ఇస్తాయని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
పొంగిపొరలే ఈ ఉత్సుకతే ఏ పనిని అయినా సరే, పూర్తి చేయడంలో మనిషికి విజయాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ –
‘‘కర్మశీలురు, శక్తిమంతులైన దేశ ప్రజలే అన్నింటి కన్న పెద్ద శక్తి ఏ దేశానికైనా. వారి కృషితోనే అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వారి ప్రయత్నాలతో దేశం సమృద్ధిని, స్వయంసమృద్ధిని, ప్రగతి శిఖరాన్ని అందుకొంటుంది.
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః
కరోతి సఫలం జన్తోః కర్మ యచ్చ కరోతి సః’’ అని పేర్కొన్నారు.
ఉత్సాహం, సకారాత్మక శక్తి మనుషులను వారి పనులలో నిరంతరం చురుకుగా ఉండేటట్లు ప్రేరణను అందిస్తాయి. పొంగి పొర్లుతూ ఉండే ఈ ఉత్సాహమే… మనిషి పూర్తి చేయాలనుకునే ఏ పనిలోనైనా సాఫల్యాన్ని అందిస్తుందని ఈ సుభాషితం బోధిస్తోంది.
***
कर्मशील और ऊर्जावान देशवासी ही राष्ट्र की सबसे बड़ी शक्ति हैं, जिनके परिश्रम से विकास की नई राहें तय होती हैं। इनके प्रयासों से देश समृद्धि, आत्मनिर्भरता और उन्नति के शिखर को छूता है।
— Narendra Modi (@narendramodi) April 30, 2026
अनिर्वेदो हि सततं सर्वार्थेषु प्रवर्तकः।
करोति सफलं जन्तोः कर्म यच्च करोति सः॥ pic.twitter.com/DmPu2cRrNz