పిఎంఇండియా
ఐక్యత, పరస్పర సహకారమనే బంధాలతో ప్రజలందరూ ఏకమైనప్పుడు దేశానికున్న శక్తి అనేక రెట్లు పెరుగుతుందని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. భారత ప్రజలకున్న ఈ సమష్టి సంకల్పంతోనే ప్రగతిపథంలో దేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి:
ఐక్యత, పరస్పర సహకారమనే సూత్రంతో ప్రజలు ఏకమైనప్పుడు, దేశానికున్న శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. భారత ప్రజలకున్న ఈ సమష్టి సంకల్పంతోనే అభివృద్ధిలో నూతన శిఖరాలను మన దేశం అధిరోహిస్తోంది.
ధూమాయంతే వ్యపేతాని జ్వలంతి సహితాని చ।
ధృతరాష్ట్రోల్ముకానీవ జ్ఞాతయో భరతర్షభ।।
ఒక చెక్క ముక్క విడిగా తన శక్తిని ప్రదర్శించలేదు. అనేక చెక్క ముక్కలు కలిసినప్పుడు అవి పూర్తిస్థాయిలో వెలుగునీ, వెచ్చదనాన్నీ అందించగలవు. అదే విధంగా ఒక దేశం పురోగతి, సంక్షేమం, బలం దాని ప్రజల ఐక్యత, పరస్పర సహకారం, సామూహిక సంకల్పంపై ఆధారపడి ఉంటాయి.
***
जब नागरिक एकजुटता और आपसी सहयोग के सूत्र में बंधते हैं, तो राष्ट्र की शक्ति कई गुना बढ़ जाती है। भारतवासियों के इसी सामूहिक संकल्प से आज देश उन्नति की नित-नई ऊंचाइयों को छू रहा है।
— Narendra Modi (@narendramodi) June 3, 2026
धूमायन्ते व्यपेतानि ज्वलन्ति सहितानि च।
धृतराष्ट्रोल्मुकानीव ज्ञातयो भरतर्षभ॥ pic.twitter.com/ySNn4JgNHn